నారద వర్తమాన సమాచారం
ప్రశాంతంగా ఎన్నికలు జరగాలి..అల్లర్లు గొడవలు సృష్టించాలని చుస్తే అటువంటి వారిపై కఠిన చర్యలు తప్పవు .. పల్నాడు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాస రావు…
జిల్లాలో గురువారం జరుగునున్న ఎంపీపీ , ఉపసర్పంచ్ స్థానాలకు జరుగునున్న ఎన్నికల్లో గొడవలు అల్లర్లు సృష్టించాలని చూస్తే అటువంటి వారిపై కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ హెచ్చరించారు.
ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు పటిష్టమైన పోలీసు భద్రత మరియు బందోబస్తు ఏర్పాట్లు సిద్ధం చేసినట్లు జిల్లా ఎస్పీ తెలిపారు.
ఎన్నికలు నిష్పక్షపాతంగా నిర్వహించడం జరుగుతుందన్నారు.
ఈ ఎన్నికల సమయంలో 30 యాక్ట్ అమలులో ఉంటుందని, 144 సెక్షన్ అమలు పరచడం జరుగుతుందన్నారు.
నిరంతరం సీసీ కెమెరాలు, డ్రోన్ల తో నిఘా ఉంటుందన్నారు.
ఎన్నికల నిబంధన ఉల్లంఘిస్తే ,అటువంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్పీ గారు హెచ్చరించారు.
ఎన్నికలు ప్రశాంతంగా జరిగే విధంగా అందరూ సహకరించాలని ఎస్పీ కోరారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.