నారద వర్తమాన సమాచారం
అర్జీల పరిష్కారంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి..ప్రత్యేక కలెక్టర్ గాయత్రి దేవి.
పి జి ఆర్ ఎస్ “మీ కోసం”లో ప్రజల నుంచి 152 అర్జీలు స్వీకరించాం.
ప్రత్యేక కలెక్టర్ గాయత్రి దేవి.
చిలకలూరి పేటలో నియోజక వర్గ స్థాయిలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించిన నేపథ్యంలో నరసరావుపేటలోని స్థానిక కలెక్టరేట్లో
ప్రత్యేక కలెక్టర్ గాయత్రి దేవి, డిప్యూటీ కలెక్టర్ కుముదిని, కలెక్టరేట్ ఏవో లీలా సంజీవ కుమారి అధ్యక్షతన నిర్వహించారు.ప్రజా సమస్యల పరిష్కార వేదిక లో కలెక్టరేట్ లో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పబ్లిక్ గ్రీవెన్స్ రీడ్రసెల్ సిస్టం, పిజిఆర్ఎస్) కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుంచి 152 అర్జీలను స్వీకరించారు.
వచ్చిన అర్జీలను ఆయా శాఖల అధికారులు సత్వరం పరిష్కరించేలా ప్రత్యేక శ్రద్ద చూపాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ప్రజా సమస్యల పరి ష్కార వేదిక’లో వచ్చే ప్రతి అర్జీకి అర్థవంతమైన సమాధానం ఇస్తూ త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.