నారద వర్తమైన సమాచారం
పల్నాడు జిల్లాలో పెదకూరపాడు నియోజకవర్గంలో 2025- 2026 వార్షిక సంవత్సరములో జాబ్ క్యాలెండర్ విడుదల చేసిన మంత్రులు అధికారులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ వారి ఆధ్వర్యంలో 2025- 2026 వార్షిక సంవత్సరంలో జాబ్ మేళా క్యాలెండర్ ని పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గంలోని అమరావతి నందు రిలీజ్ చేయడం జరిగింది. మన పల్నాడు జిల్లా ఇన్చార్జి మినిస్టర్ గొట్టిపాటి రవికుమార్ మరియు పార్లమెంటు సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు అలాగే జిల్లా కలెక్టర్ పి అరుణ్ బాబు మరియు జాయింట్ కలెక్టర్ సూరజ్ గనూరే సమక్షంలో జాబ్ మేళా గోడ పత్రికను రిలీజ్ చేయడం జరిగింది ఈ కార్యక్రమం ఉద్దేశించి మన పల్నాడు జిల్లా ఇన్చార్జి మినిస్టర్ గొట్టిపాటి రవికుమార్ మాట్లాడుతూ ఈ యొక్క మంచి అవకాశాన్ని మన పల్నాడు జిల్లాలోని నిరుద్యోగ యువతీ యువకులు అందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను అలాగే మన జిల్లాలోని మరియు రాష్ట్రంలోని ఉన్నటువంటి వనరులు మరియు పరిశ్రమలు దృష్టిలో పెట్టుకొని వారికి ఉపాధి అవకాశాలు కల్పించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి పెదకూరపాడు నియోజకవర్గ శాసనసభ్యులు భాష్యం ప్రవీణ్ మరియు పలనాడు జిల్లా నైపుణ్య అభివృద్ధికారి ఈ తమ్మాజీ రావు జిల్లా అధికారులు మరియు లోకల్ నాయకులు పాల్గొన్నా రు
Discover more from
Subscribe to get the latest posts sent to your email.