నారద వర్తమాన సమాచారం
పెదకూరపాడు మండలము కాశిపాడు గ్రామములో ఉద్యాన పంటలను పరిశీలించిన గౌరవ జిల్లా కలెక్టరు మరియు జాయింట్ కలెక్టరు :
పల్నాడు జిల్లా కలెక్టర్ మరియు జాయింట్ కలెక్టర్ ది. 08.04.2025 న పెదకూరపాడు మండలములోని కాశిపాడు గ్రామములో ఉద్యాన పంటలైన బొప్పాయి, డ్రాగన్ ఫ్రూట్, అవకాడో మరియు జామ తోటలను పరిశీలించటం జరిగినది. ఉద్యాన పంటల సాగుకు సంబంధించిన సమస్యలను, రాబడి, ఖర్చుల గురించి రైతులతో చర్చించటం జరిగినది. అలాగే జిల్లాకు అధిక ఆదాయ ఆర్జనలో హర్టీకల్చర్ ప్రధాన పాత్ర పోషిస్తుందని తెలిపారు.
ఉద్యాన రైతు అయిన శ్రీ అడపా ఆంజనేయులు బొప్పాయి సాగులో ఎకరాకు 1000 మొక్కలు నాటి, దిగుబడి 40 టన్నులు రాగా సరాసరి కిలో రూ.10/- చొప్పున, రూ. 1.50 లక్షలు ఖర్చులకు పోగా, రూ. 2.50 లక్షలు ఆదాయం పొందుతున్నట్లు తెలియ చేశారు.
ఉద్యాన పంటల సాగు రైతులు, కేవలం మిరప పంటకే పరిమితం కాకుండా జామ, డ్రాగన్ ఫ్రూట్ వంటి పండ్ల తోటలను సాగు చేసి, అధిక ఆదాయం పొందాలని పల్నాడు జిల్లా కలెక్ట్ వారు ఈ సందర్భంగా రైతులకు తెలియజేశారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.