నారద వర్తమాన సమాచారం
ఇసుక అక్రమ రవాణాపై కఠిన చర్యలు
జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు
పల్నాడు జిల్లాలో జరుగుతున్న ఇసుక అక్రమ రవాణాపై కఠిన చర్యలు తీసుకోవాలని పల్నాడు జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు పోలీస్, రెవెన్యూ,గనుల శాఖలకు ఆదేశాలు జారీ చేశారు. బుధవారం జిల్లా కేంద్రమైన నరసరావుపేటలోని ఎస్సార్ శంకరన్ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ ఇసుక రీచ్ల ప్రస్తుత స్థితి పై పల్నాడు జిల్లాలో రాబోయే వర్షాకాలం కోసం సుమారు 5.00 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుక నిల్వ కోసం ప్రభుత్వ సూచనల పై చర్చించారు. దీని ప్రకారం, పల్నాడు జిల్లాలో డీసిల్టింగ్ పాయింట్లు, మాన్యువల్ ఇసుక రీచ్లు, పట్టాలాండ్ల డీ-కాస్టింగ్ మరియు ఓపెన్ ఇసుక రీచ్ల కార్యకలాపాల ద్వారా 5.50 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుకను సాధించడానికి అవసరమైన చర్యలను తీసుకోనుట పై చర్చించారు. ఈ సమావేశానికి సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.