నారద వర్తమాన సమాచారం
సోమవారం టౌన్ హాల్ వేదికగా ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక : జిల్లా కలెక్టర్ పి. అరుణ్ బాబు ఐఏఎస్
నరసరావు పేట,
రానున్న సోమవారం (21.04.2025) జిల్లా కేంద్రం నరసరావు పేట పట్టణంలోని టౌన్ హాల్ వేదికగా ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించనున్నామని జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు తెలిపారు. సాధారణంగా కలెక్టరేట్ లో నిర్వహించే పీజీఆర్ఎస్ వేదిక మార్పును ప్రజలు గమనించుకోవాలన్నారు.
నియోజక వర్గ స్థాయిలో పీజీఆర్ఎస్ కార్యక్రమాన్ని నిర్వహించడంలో భాగంగా ఈసారి నరసరావు పేట నియోజక వర్గాన్ని ఎంపిక చేశామన్నారు.
ఏప్రిల్ మొదటి వారంలో చిలకలూరి పేట పట్టణంలో తొలిసారిగా నియోజక వర్గ స్థాయిలో పీజీఆర్ఎస్ కార్యక్రమం నిర్వహించగా ప్రజలు, ప్రజా ప్రతినిథుల నుంచి గొప్ప స్పందన వచ్చిందన్నారు. 300 వరకూ వినతులు అందాయన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.