నారద వర్తమాన సమాచారం
అసాంఘిక కార్యకలాపాల కట్టడికై పల్నాడు జిల్లా వ్యాప్తంగా విస్తృతంగా వాహన తనిఖీలు చేపట్టిన జిల్లా పోలీస్ అధికారులు మరియు సిబ్బంది.
ఈరోజు(18.04.2025) రాత్రి గుంటూరు జిల్లా వ్యాప్తంగా అసాంఘిక కార్యకలాపాలను కట్టడి చేసి, ప్రజలకు భరోసా కల్పించే ఉద్దేశంతో విజిబుల్ పోలీసింగ్ నిర్వహణలో భాగంగా పల్నాడు జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ పరిధిలలో శాంతి భద్రతలు పరిరక్షణ, ట్రాఫిక్ నిబంధనలు అమలు, అసాంఘిక కార్యకలాపాల కట్టడికి పోలీస్ అధికారులు తీసుకుంటున్న చర్యలు.
గంజాయి, ఇతర మాదక ద్రవ్యాల రవాణా మరియు బహిరంగ మద్యపానం వంటి కార్యకలాపాలను అరికట్టడానికి సంబంధించి జిల్లా వ్యాప్తంగా వాహన తనిఖీలను విస్తృతంగా నిర్వహించి, అనుమానితులను విచారించడం జరిగింది.
ఎటువంటి అపద సమయంలోనైనా పోలీస్ వారు అండగా ఉంటారు అని ప్రజలకు భరోసా కల్పించే విధంగా విజిబుల్ పోలీసింగ్ నిర్వహించాలని పోలీస్ అధికారులు పోలీస్ ఉన్నతాధికారులు సూచించారు.
ఈ వాహన తనిఖీల్లో జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ సబ్ డివిజన్ల డీఎస్పీలు, పోలీస్ స్టేషన్ల సీఐలు, ఎస్సైలు, మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.