నారద వర్తమాన సమాచారం
హైదరాబాద్లో 208 మంది పాకిస్తానీలు.. ఉన్నట్లు గమనించిన కేంద్రం సిఎమ్ కు అమిత్ షా ఫోన్
కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నీ రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఫోన్ చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి ఆఫీసక్కు అమిత్ షా ఫోన్ చేసి హైదరాబాద్లో పాకిస్తానీయులపై ఆరా తీశారు. పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్తాన్ పౌరులను భారత్ విడిచి వెళ్లిపోవాలని కేంద్రం ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పాక్ దేశస్తులను గుర్తించి వెనక్కి పంపాలని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది. పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థలను ప్రోత్సహించి భారత్ మీదకు ఉసిగొల్పుతుందని ఆ దేశంలో దౌత్య సంబంధాలు రద్దు చేసింది. ఇండియాలో పాకిస్తాన్ హైకమిషన్ ఆఫీస్ కూడా ఖాళీ చేసి వెళ్లాలని విదేశాంగ శాఖ ఆదేశాలు పంపింది. ఇప్పటికే పాకిస్తానీల వీసాలు రద్దు చేశారు. హైదరాబాద్లో పాకిస్తానీయులపై పోలీసులు నజర్ పెట్టారు. పాక్ పౌరుల వివరాలు సేకరించారు. 208 మంది పాకిస్తానీలు హైదరాబాద్లో ఉన్నటున్నట్లు అధికారులు గుర్తించారు. వీరి మరో రెండు రోజుల్లోగా పాకిస్థాన్ వెళ్లిపోవాలని కేంద్ర హోం శాఖ ఆదేశించింది. కేంద్ర ఇచ్చిన గడువు ముగుస్తోండటంతో అన్ని రాష్ట్రాలను కేంద్రహోంశాఖ అలెర్ట్ చేసింది. అదే విధంగా పాక్, ఇండియా ఉద్రిక్త పరిస్థితుల్లో దేశవ్యాప్తంగా కట్టుదిట్టమైన రక్షణ చర్యలు తీసుకుంటున్నారు. ప్రధాన నగరాల్లో సెక్యురీటీ హై అలర్ట్ చేశారు.