నారద వర్తమాన సమాచారం
పదవ తరగతి లో మెరిట్ సాధించిన కావ్య శ్రీ ఇంటిని సందర్శించిన కలెక్టర్ పి.అరుణ్ కుమార్ ఐఏఎస్
కారంపూడి:-
పదవ తరగతి పరీక్ష ఫలితాలలో కారంపూడి లోని ప్రభుత్వ పాఠశాలలో చదువుతూ అత్యధిక మార్కులు (598) సాధించిన కావ్య శ్రీ ని కారంపూడి లోని వారి స్వగృహంలో జిల్లా కలెక్టర్ పి. అరుణ్ బాబు శుక్రవారం ఉదయం కలిశారు. రామయ్య ,కోటేశ్వరమ్మ దంపతులకు జన్మించిన కావ్య శ్రీ ని పై చదువులు నిమిత్తం దత్తత తీసుకోవడం జరిగిందని వారు ఏం చదువుకోవాలో వివరాలు అడిగి తెలుసుకున్నారు. పై చదువులు నిమిత్తం ఏ చదువులు చదువుతారో ఎక్కడ చదువుతారో వివరాలు అడిగి త్వరితగతిన తెలపవలసిందిగా కోరారు. తద్వారా అవసరమైన సహాయం అందించేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. అదేవిధంగా జిల్లా రోడ్లు భవనాలు శాఖ అధికారి శ్రీ రాజనాయకు దత్తత తీసుకున్న చంద్రిక ఇంటికి వెళ్లి అత్యధిక మార్కులు(598) సాధించినందుకు అభినందనలు తెలిపారు. అదేవిధంగా పై చదువులు నిమిత్తం వారి తల్లి, తండ్రి అభీష్ట మేరకు సివిల్ సర్వీసెస్ పరీక్షకు ప్రిపేర్ అయ్యేలా భాష్యం స్కూల్లో చదువుటకు అవసరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని సదరు విషయాన్ని రోడ్లు భవనాల శాఖ అధికారికి తెలియజేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో రెవిన్యూ డివిజనల్ అధికారి మురళీకృష్ణ, జిల్లా విద్యాశాఖ అధికారి చంద్రకళ, మండల రెవెన్యూ అధికారి వెంకటేశ్వర్లు నాయక్ తదితరులు పాల్గొన్నారు……
Discover more from
Subscribe to get the latest posts sent to your email.