నారద వర్తమాన సమాచారం
నామినేట్ పదవులలో విశ్వబ్రాహ్మణులకు ప్రాముఖ్యత ఇవ్వాలి జిల్లా అధ్యక్షులు చెన్నుపల్లి
ప్రకాశం జిల్లా:-
పొదిలి శామంత పూడి నాగేశ్వరరావు టింబర్ డిపోలో జరిగిన. సమావేశంలో ముఖ్యఅతిథిగా ప్రకాశం జిల్లా విశ్వబ్రాహ్మణ అధ్యక్షులుచెన్నుపల్లి శ్రీనివాసచారి ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ.కుటమి ప్రభుత్వం అధికారo లోకి రావడానికి. రాష్ట్ర వ్యాప్తంగా విశ్వబ్రాహ్మణులు కూడా అత్యధిక మంది ఓట్లు వేసి గెలిపించారు. కావున విశ్వబ్రాహ్మణలకు రాజకీయ ప్రాధాన్యత కల్పించే దిశగా.
పొదిలి ప్రాంతం నుండి రాష్ట్రస్థాయిలో నామినేట్ పదవి ఇవ్వాలని. ముఖ్యమంత్రి.,డిప్యూటీ సీఎం స్థానిక శాసనసభ్యులు నారాయణ రెడ్డి ని కోరుతున్నాము. అలాగే గత ప్రభుత్వంలో కూల్చివేయబడి న ఆరామ క్షేత్రాన్ని ప్రభుత్వమే నిర్మించి ఇవ్వాల్ని కోరుతున్నాము.
ప్రకాశం జిల్లాలో 10 తరగతి లో 500 మార్కులు ఇంటర్లో 850 పై మార్కులు సాధించిన విశ్వబ్రాహ్మణ విద్యార్థిని విద్యార్థులకు ప్రోత్సహక బహుమతులు అందించి అభినందన కార్యక్రమం పొదిలి విశ్వబ్రాహ్మణ సంఘం సహకారంతో త్వరలో ఏర్పాటు చేయబడును అని సామంత పూడి నాగేశ్వరరావు.అన్నారు మర్రిపూడి సంఘ నాయకులు.ఈదుముడి రవి ప్రసాద్. ప్రసాదు. వినుకొండ శ్యామల. రాష్ట్ర నాయకులు పొన్న పల్లి బ్రహ్మానందం. చంద లూరి శేష బ్రహ్మచారి దొడ్డేటిపల్లి రామేశ్వరా చారి. దర్శి. దొడ్డుజు విశ్వనాథ చారి. నిమ్మకూరు మాల్యాద్రి. కనిగిరి. అద్దంకి అజయ్ కుమార్. తువ్వ పాటి జనార్ధన చారి. కార్పెంటర్ సంఘ అధ్యక్షులు రాచర్ల శేఖర్. గుత్తికొండ కళ్యాణ్..వడ్ల మాని నారాయణ వివిధ మండల సంఘ నాయకులు పాల్గొన్నారు