Tuesday, May 20, 2025

పల్నాడు జిల్లా నకరికల్లు వద్ద బస్సు ప్రమాదం

నారద వర్తమాన సమాచారం

పల్నాడు జిల్లా నకరికల్లు వద్ద బస్సు ప్రమాదం

పల్నాడు జిల్లా :-

బస్సు బోల్తా పడి సుమారు 8 మందికి గాయాలైన వారిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించి వైద్యం చేయించిన పోలీసులను అభినందించిన జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు ఐపీఎస్

ఈ రోజు తెల్లవారుజామున
5:45 గంటల సమయంలో ఏపీ 39టీబీ 6066 అను నెంబర్ గల శ్రీ లక్ష్మీ గాయత్రి ట్రావెల్ నాన్ ఏసీ బస్సు 40 మంది ప్రయాణికులతో హైదరాబాదు నుండి చీరాల కు వెళుతూ ఉండగా,
మార్గం మధ్యలో నకరికల్లు మండలం, శాంతినగర్ గ్రామంలోని ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంకు ఎదురుగా చేరుకునేసరికి,

బస్సు డ్రైవరు సైడ్ అడ్జస్ట్మెంట్ సరిగ్గా చూసుకోకుండా బస్ ని అతివేగంగా నడుపుతూ ముందు వెళుతున్న ద్విచక్ర వాహనాన్ని తప్పించబోయి ఒక్కసారిగా బస్సు ని కుడివైపుకి తిప్పడంతో బస్సు రోడ్డు పక్కన ఉన్న మార్జిన్ లో ఒక ప్రక్కకు పడిపోవడం జరిగింది.
అక్కడ ఉన్న స్థానికులు వెంటనే పోలీసు వారికి సమాచారం అందించగా
అక్కడకు చేరుకున్న చుట్టుపక్కల వారు,పోలీసులు బస్సు లోపల వారందరినీ బయటకు తీసినారు. సుమారు 7 గురికి గాయలవ్వగా వారిని చికిత్స నిమిత్తం అంబులెన్స్ లో హాస్పిటల్ కి తీసుకు వెళ్లడం జరిగింది.

సుమారు 27 సం.ల ఒక ఆడ మనిషి బస్ లోపల కింది భాగంలో ఇరుక్కుని పోగా, నకరికల్లు మరియు నరసరావుపేట నుండి వచ్చిన పోలీస్ ఆఫీసర్లు ఎస్పీ ఆధ్వర్యంలో క్రేన్లు, జెసిబి సాయంతో బస్సును పైకి లేపి ఆడ మనిషిని బయటికి తీసి అంబులెన్స్ లో ఆస్పత్రికి పంపినారు సార్.

ఈ ప్రమాదంలో సుమారు 8 మందిని గాయాలతో హాస్పిటల్ నందు చేర్పించినారు. బస్సులో ప్రయాణిస్తున్న వారెవ్వరికీ ఎటువంటి ప్రాణాపాయం లేదు.

ప్రమాదం జరిగిన గోల్డెన్ అవర్ లోపల క్షతగాత్రులను రక్షించి హాస్పిటల్ కు పంపినందుకు గానుఎస్పీ స్థానికులు, పోలీసులు మరియు సమాచారం అందించిన మీడియా వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపి అభినందించారు.
ఈ సంఘటన జరిగిన తరువాత హుటా హుటిన పల్నాడు జిల్లా ఎస్పీ తో పాటు నరసరావుపేట డిఎస్పి కె.నాగేశ్వరరావు , నరసరావుపేట రూరల్ సీఐ పి. రామకృష్ణ , నరసరావుపేట రూరల్ ఎస్సై కిషోర్ , నకరికల్లు ఎస్సై సిహెచ్ . సురేష్ బాబు మరియు పోలీస్ సిబ్బంది వెళ్లి సహాయ సహకారాలు అందించారు.

Loading spinner
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

You cannot copy content of this page