నారద వర్తమాన సమాచారం
బాధ్యతాయుతంగా పింఛను పంపిణీ చేయండి జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు
గ్రామ & వార్డు సచివాలయ సిబ్బందిని ఆదేశించిన జిల్లా కలెక్టర్
నరసరావు పేట,
ప్రతి నెలా ఒకటో తేదీన నిర్వహించే పింఛను పంపిణీ కార్యక్రమాన్ని బాధ్యతాయుతంగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు గ్రామ&వార్డు సచివాలయాల సిబ్బందిని ఆదేశించారు.
స్థానిక కలెక్టరేట్ లోని జాషువా సమావేశ మందిరంలో పింఛను పంపిణీ ఫీడ్ బ్యాక్ సర్వేపై సమీక్ష సమావేశం నిర్వహించారు.
పింఛను పంపిణీ కార్యక్రమంపై నేరుగా లబ్ధిదారుల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకోవడం జరుగుతోందన్నారు. పింఛను దారులతో ప్రవర్తించే విధానం, పింఛను పంపిణీలో అక్రమాలు, ఇంటి వద్దే పంపిణీ వంటి అంశాలపై ఫీడ్ బ్యాక్ స్వీకరిస్తున్నామన్నారు. పదే పదే నెగెటివ్ ఫీడ్ బ్యాక్ అందిన సిబ్బందిపై చర్యలు తీసుకుంటామన్నారు.
జీవిత భాగస్వామి పింఛను బదిలీ కోసం అందిన 3900 వరకూ దరఖాస్తులను రేపట్లోగా ఆమోదించాలన్నారు. ఆధార్ లేని శిశువుల సర్వే, సిటిజెన్ ఈకేవైసీలను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు.
ఈ కార్యక్రమంలో డీఆర్డీఏ పీడీ ఝాన్సీ రాణి, గ్రామ వార్డు సచివాలయాల నోడల్ అధికారి వెంకట్ రెడ్డి, డీఎల్డీవో గబ్రు నాయక్, రాజగోపాల్ తదితరులు పాల్గొన్నారు.