నారద వర్తమాన సమాచారం
ప్రజా ప్రతినిధులు అధికారులు అందరు ప్రకృతి వ్యవసాయం పై ఆసక్తి…
డి పి యం కె. అమలకుమారి
పల్నాడు జిల్లా…
ప్రకృతి వ్యవసాయ విభాగం..
ఈరోజు పల్నాడు జిల్లా లో సత్తెనపల్లి నియోజకవర్గం.. పరిధిలో ని అన్నీ విభగాలకు చెందిన అధికారుల పనితీరును.. శాసనసభ్యులు కన్నా లక్ష్మణ్ నారాయణ…క్షుణంగా పరిశీలించడం జరిగినది.. ఈ కార్యక్రమంలో భాగంగా. ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు… పల్నాడు జిల్లా కలెక్టర్ పి అరుణ్ బాబు.(ఐ ఎ య స్ .) జాయింట్ కలెక్టర్ సూరజ్ ధనుంజయ్.., డిఆర్ ఓ మురళి.. అలాగే పల్నాడు జిల్లాలోని అధిరత మహా రదులందరు ఈ కార్యక్రమంలో పాల్గొని అన్ని డిపార్ట్మెంట్ ల పనితీరును క్షుణ్ణంగా పరిశీలన చేయడం జరిగినది అలాగే.. ఈరోజు జరిగిన సమన్వయ సమావేశం అనంతరం .. ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతులు వారి ఉత్పత్తులతో స్టాల్ ఏర్పాటు చేయడం జరిగినది. .. అలాగే 30 రకాల విత్తనాలు రైతులు తమ పొలములో చల్లుకోవడం వల్ల.. భూమిలోని కర్భన్ శాతం పెరుగుతుందని తెలియజేయడం జరిగినది.. ఈరోజు పలు రైతులకు పి యం డీ ఎస్ కిట్స్ పంపిణీ చేయడం జరిగినది.. అలాగే ఇప్పటికే ప్రకృతి వ్యవసాయం చేస్తున్న ఉన్న రైతులకు పి జి య స్ ( పాటీ స్ పెంటరి గ్యారంటీ సిస్టం )సర్టిఫికెట్ ఇవ్వటం జరిగింది… కాబట్టి రైతులందరూ ప్రకృతి వ్యవసాయ బాటలో నడిచి వారి ఆరోగ్యాన్ని వారి భూ ముల ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని పల్నాడు జిల్లా కలెక్టర్ పి అరుణ్ బాబు జిల్లా రైతు లకు తెలియజేసారు.అధికారులు మరియు ప్రజా ప్రతినిధులు, రైతులు, … మరియు డి పి యం అమల కుమారి, యన్ యఫ్ ఎ లు,మేరీ, నందకుమార్ అప్పలరాజు సైదియ్య ప్రకృతి వ్యవసాయ సిబ్బంది అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగినది.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.