మీడియాకు ఏపీ డిజిపి మాస్ వార్నింగ్
నారద వర్తమాన సమాచారం
మీడియాకు ఏపీ డిజిపి హరీశ్ కుమార్ గుప్తా మాస్ వార్నింగ్ ఇచ్చారు. సహజ మరణాలను లాకప్ డెత్ లుగా అసత్య ప్రచారం చేస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. తప్పుడు వార్తలు రాసే పత్రికలు, ఛానళ్లు, సోషల్ మీడియా తప్పని సరిగా విచారణ ఎదుర్కోవాల్సి ఉంటుందన్నారు. ప్రకాశం జిల్లాలో లాకప్ డెత్ అంటూ వచ్చిన వార్తపై స్పందించిన ఆయన.. ప్రజలను తప్పుదోవ పట్టించేలా పోలీస్ శాఖపై నిందలు వేయవద్దని సూచించారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.