నారద వర్తమాన సమాచారం
యోగాంద్రాలో ప్రజలను భాగస్వామ్యం చేయండి..జిల్లా కలెక్టర్ .
పి అరుణ్ బాబు..
మే 22: యోగాంద్రలో ప్రజలను భాగస్వామ్యం చేయాలని జిల్లా కలెక్టర్ పి అరుణ్ బాబు సంబంధిత అధికారులకు సూచించారు. గురువారం యోగాంద్ర కార్యక్రమంపై జిల్లా, మండలస్ధాయి అధికారులతో కలెక్టర్ టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ జూన్ 21 వరకు యోగా ప్రాముఖ్యతను విస్త్రృత ప్రచారం ద్వారా ప్రజల్లో చేతన్యం కలిగించాలన్నారు. యోగా ప్రాముఖ్యతను తెలిపేలా విద్యార్ధినీ, విద్యార్ధులకు ఆయా రంగాల్లోని వారికి వివిధ పోటీలను నిర్వహించాలన్నారు. యోగాంధ్ర కార్యక్రమం విజయవంతం చేసేందుకు మండల, గ్రామస్ధాయి కమిటీలను ఏర్పాటు చేయాలన్నారు. ప్రతి మండలంలో యోగా శిక్షకులను గుర్తించి అభ్యాస కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. జిల్లాలో ఎక్కువ సంఖ్యలో యోగా అభ్యాసాలకు ప్రజలను నమోదుచేసేందుకు కృషిచేయాలన్నారు. యోగా సాధనతో మానసిక, శారీరక ఆరోగ్యం ఎంతో మెరుగుపడుతుందని, అదే విధంగా ప్రశాంతత, ఆధ్యాత్మికచింతన వృద్ధిచెందుతాయన్నారు. యోగా డే లో పాల్గొనే వారి పేర్లు నమోదు చేసుకునేందుకు రూపొందించిన యాప్ పై అవగాహన కల్పించాలన్నారు. ప్రతిరోజు జిల్లాలోని నరసరావుపేటతో పాటు మున్సిపాలిటీ ల్లో మండలస్ధాయిలో యోగా ప్రాముఖ్యతను తెలిపే కార్యక్రమాలను నిర్వహించాలని యంపిడివోలను కలెక్టర్ ఆదేశించారు. జిల్లాలో పర్యాటక సంబంధిత ప్రదేశాల్లో యోగా ప్రాముఖ్యతపై కార్యక్రమాలు నిర్వహించాలని పర్యాటకశాఖ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. రు. సంబంధిత యంపిడివోలు ఈ కార్యక్రమాలను పర్యాటకశాఖ అధికారులతో సమన్వయం చేసుకోవాలన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.