నారద వర్తమాన సమాచారం
ఇసుక సేకరణ అనంతరం స్టాక్ పాయింట్లకు వెళ్లాలని సంబంధిత అధికారులు ఆదేశించిన జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు ఐఏఎస్
జిల్లాలో ఉన్న ఇసుక రీచ్ ల ద్వారా లక్ష టన్నుల ఇసుక సేకరణ అనంతరం బయటకు ఇసుక వెళ్లాలని జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు సంబందిత అధికారులను ఆదేశించారు.మంగళవారం స్థానిక కలెక్టర్ కార్యాలయములోని యస్.ఆర్.సంకరన్ విడియో కాన్ఫరెన్స్ హాలులో 8 వ జిల్లా స్థాయి సాండ్ కమిటి సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రస్తుతం సుమారు 60,000 వేల టన్నుల ఇసుక మల్లాది మరియు కోసూరు స్థాక్ యార్డులలో అందు బాటులో ఉందన్నారు. ఇసుక రీచ్ ల నుండి స్టాకు పాయింట్ల వరకు ఇసుక రవాణాకు టన్నుకు చెల్లించే పైకం పై సత్వరమే నిర్ధారణ చేయాలని జాయింట్ కలెక్టర్ సూరజ్ గనోరే మరియు జిల్లా మైన్స్ మరియు గనుల శాఖాధికారి నాగిని ని ఆదేశించారు. అదేవిధముగా చిలకలూరిపేట, వినుకొండ మరియు మాచెర్ల వద్ద స్టాక్ యార్డులు ఏర్పాటు చేసే విధముగా స్థల సేకరణకు అవసరమైన చర్యలు తీసుకోవాలాన్నారు. తంగేడ, పొందుగల మరియు విజయపురి సౌత్ వద్ద ఉన్న ఇసుక పాయింట్ లవద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. రానున్న రోజులలో ఇసుక స్థాక్ యార్డుల వద్ద రాత్రిపూట వాచ్ మెన్ లను ఏర్పాటు చేసే విధంగా అవసరమైన చర్యలు చేపట్టాలని తెలిపారు. ఈ కార్యక్రమములో అడిషనల్ యస్.పి జే.వి.సంతోష్ మరియు సత్తెనపల్లి రెవిన్యూ డివిజినల్ అధికారి రమాకాంత్ రెడ్డి,సంబందిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. ……
Discover more from
Subscribe to get the latest posts sent to your email.