నారద వర్తమాన సమాచారం
ఈనెల 30వ తారీకు న జరగనున్న మెగా డీఎస్సీ పరీక్షలు పగడ్బందీగా నిర్వహించాలి అని అధికారులు ఆదేశించిన పల్నాడు జిల్లా కలెక్టర్
జిల్లాలో రేపటి నుండి ఈ నెల 30 వ తేదీవరకు నిర్వహించనున్న మెగా డియస్ సి పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని, పరీక్ష సెంటర్ల వద్ద మౌలిక వసతులు కల్పించాలని జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు అన్నారు. గురువారం స్థానిక కలెక్టర్ కార్యాలయములోని యస్.ఆర్.శంకరన్ వీడియో కాన్ఫరెన్సు హాలులో డియస్ సి పరీక్ష నిర్వహాణపై సబందిత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా మూడు షిఫ్ట్ లలో సుమారుగా 18,415 మంది అబ్యర్ధులు పరీక్ష వ్రాస్తున్నారన్నారు. మారుమూల ప్రాంతాలనుండి అభ్యర్ధులకు అనువుగా బస్ సర్వీసులు ఏర్పాటు చేయాలని, అభ్యర్ధులకు పరీక్షా కేంద్రాలు తెలిసేలా ప్రధాన కూడళ్ళలో సైన్ బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. ప్రభుత్వ గుర్ధింపు పొందిన కార్డులు అనుమతించడం జరుగుతుందని, పరీక్షకు ఒక గంట ముందుగా అభ్యర్ధులు హాజరుకావాలని, నిముషం లేటు అయినా అనుమతించడం జరుగదని తెలిపారు. అభ్యర్ధులు కలర్ ఫోటోను అందుబాటులో వుంచుకోవాలన్నారు. కంప్యూటర్ పరీక్ష అయినందున నిరంతర విద్యుత్ సరఫరా చేయాలన్నారు. ఫస్ట్ ఎయిడ్ కిట్స్ మరియు 108 వాహనాలు అందుబాటులో ఉంచాలన్నారు. జిల్లా యంత్రాంగం వలన ఎ వొక్క అభ్యర్ధి నష్ట పోకుండా చూడాలన్నారు. చాల కాలం తరువాత డియస్సి నిర్వహించడం అభ్యర్ధులకు మంచి ఆకాశం అని కొనియాడారు. పోలిస్ బందో బస్తు పరీక్ష నిర్వహిస్తున్న 5 సెంటర్ల(తిరుమల ఇంజనీరింగ్ కాలేజి- జొన్నలగడ్డ, నరసరావుపేట ఇంజనీరింగి కాలేజీ-యల్లమంద,ఎ.యం. రెడ్డి మెమోరియల్ కాలేజి ఆఫ్ ఇంజనీరింగ్- పెట్లూరి వారి పాలెం, నరనరావు పేట ఇంజనీరింగ్ కాలేజి బ్లాక్-4 – యల్లమంద, మరియు యం.ఎ.యం.మహిళా ఇంజనీరింగ్ కాలేజి- కేశాను పల్లి) వద్ద ఏర్పాటు చేయాలని సంబందిత అధికారులను కోరారు. పరీక్ష ఉదయం 9.30 గంటల నుండి 12 గంటల వరకు, మరియు మధ్యాహ్నం 2.30 గంటలనుండి సా. 5 గంటల వరకు నిర్వహించడం జరుగుతుందన్నారు. 5 మంది ప్రభుత్వ అధికారులను మరియు ఫ్లైయింగ్ స్క్వాడ్ లను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. డియస్సి పరిక్ష కు సంబంధించి సమస్యల పరిష్కారానికి కలెక్టర్ కార్యాలయములో 24 గంటలు పనిచేసేలా కంట్రోల్ సెంటర్ ను ఏర్పాటు చేయాలని జిల్లా రెవిన్యూ అధికారిని ఆదేశించారు. ఈ కార్య క్రమములో ఆడిషన్ యస్.పి జే.వి. సంతోష్, జిల్లా రెవిన్యూ అధికారి మురళి, రెవిన్యూ డివిజినల అధికారి మధులత,జిల్లా విద్యా శాఖాధికారి చంద్ర కళ, ఇంజనీరింగ్ కళాశాలల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు….
Discover more from
Subscribe to get the latest posts sent to your email.