నారద వర్తమాన సమాచారం
అద్దంకి నార్కెట్ పల్లి హైవేపై రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం
ఈ రోజు ది. 15/6/2025 తెల్లవారుజామున 5.30 గంటల సమయంలో నకరికల్లు గ్రామానికి చెందిన కళ్ళకుంట సైదులు s/o మణి కుమార్, 30 సం.లు, మాదిగ, నకరికల్లు గ్రామం..
అద్దంకి – నార్కెట్ పల్లి హైవేపై రోడ్డు మార్జిన్ లో నకరికల్లు సెంటర్ వైపు నడుచుకుంటూ వెళ్తుండగా, నరసరావుపేట వైపు నుండి పిడుగురాళ్ల వైపుగా అతివేగంగా వస్తున్న ఓ గుర్తు తెలియని లారీ డ్రైవర్ ఆ వ్యక్తిని ఢీ కొట్టి ఆపకుండా వెళ్లిపోగా, అతని రెండు మోకాళ్ళ నుండి గిలకల మధ్య భాగంలో విరిగిపోయినాయి. ఆ పరిసర ప్రాంత ప్రజలు 108 అంబులెన్స్ కి ఫోన్ చేయగా, చికిత్స నిమిత్తం అతన్ని నరసరావుపేట ప్రభుత్వ హాస్పిటల్ కి తీసుకొని వెళ్ళినారు
అనంతరం గాయపడిన వ్యక్తిని మెరుగైన చికిత్స కొరకు గుంటూరులోని GGH కి తీసుకొని వెళ్ళగా, చికిత్స పొందుతూ ఈరోజు ఉదయం 10 గంటలకు చనిపోయినాడు
Discover more from
Subscribe to get the latest posts sent to your email.