నారద వర్తమాన సమాచారం
ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్లు పెంచండి: జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు
నరసరావు పేట,
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల అడ్మిషన్లు పెంచేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు ఆదేశించారు. ఒక్కో తరగతికి ఒక ఉపాధ్యాయుడు చొప్పున ఉన్న మోడల్ ప్రాథమిక పాఠశాలల్లో కనీసం 100 కి తగ్గకుండా అడ్మిషన్లు జరగాలన్నారు. నెమ్మదిగా నేర్చుకునే పిల్లలపై ఉపాధ్యాయులు ఎక్కువగా దృష్టి సారించి ఓపిగ్గా పాఠాలు బోధించాలన్నారు.
గురువారం ఉదయం స్థానిక కేశానుపల్లి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేశారు.
విద్యార్థులతో కలిసి డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ద్వారా అందిస్తున్న భోజనాన్ని రుచి చూసారు. పిల్లలకు రుచికరమైన భోజనం అందించేందుకు ఈ నెల నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో సన్నబియ్యం సరఫరా చేస్తున్నామన్నారు.
సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యా మిత్ర పథకం ద్వారా విద్యార్థులకు పంపిణీ చేసిన పాఠ్యపుస్తకాలు, నోటు పుస్తకాలను పరిశీలించారు. విద్యా మిత్ర కిట్లు అందరికీ అందాయా, లేదా అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. పాఠశాలలో పరిశుభ్రమైన మినరల్ వాటర్ సరఫరా చేస్తుండటంపై సంతోషం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో ఆర్డీవో మధులత, డీఈవో చంద్రకళ తదితరులు పాల్గొన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.