నారద వర్తమాన సమాచారం
స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన వారినే పీ4 మార్గదర్శకులుగా ఎంపిక చేయాలి : జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు
నరసరావు పేట,
పీ4 పథకంలో భాగంగా బంగారు కుటుంబాలను అభివృద్ధి చేసేందుకు స్వచ్ఛందంగా ముందుకు వచ్చినవారిని మాత్రమే మార్గదర్శకులుగా ఎంపిక చేయాలని జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
మార్గదర్శకులుగా చేరాలని ఎవరినీ ఎటువంటి ఒత్తిడికి గురి చేయొద్దన్నారు. తమ అనుభవం, వనరులు ఇతరుల అభివృద్ధికి ఉపయోగపడాలనే ఆలోచన, ఆసక్తి ఉన్నవారిని మాత్రమే మార్గదర్శకులుగా గుర్తించాలన్నారు. అదే విధంగా ప్రజలు వంద శాతం సంతృప్తి చెందేలా పౌర సేవలు అందించాలన్నారు.
గురువారం సాయంత్రం స్వర్ణాంధ్ర పీ4 ఫౌండేషన్, అన్నదాతా సుఖీభవ కార్యక్రమాలపై చీఫ్ సెక్రటరీ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ సూరజ్ ధనుంజయ్, డీఆర్వో మురళి తదితరులు పాల్గొన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.