నారద వర్తమాన సమాచారం
ఆగస్టు 4న తెలంగాణ కేబినెట్ భేటీ
తెలంగాణ :
ఆగస్టు 4న తెలంగాణ కేబినెట్ సమావేశం కానుంది. కాళేశ్వరం కమిషన్ నివేదికపై కేబినెట్ ప్రత్యేక భేటీ నిర్వహించనుంది. కాళేశ్వరం కమిషన్ నివేదిక అధ్యయనం కోసం కమిటీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ కమిటీలో సభ్యులుగా నీటిపారుదలశాఖ సెక్రటరీ, న్యాయశాఖ సెక్రటరీ, జీఏడీ సెక్రటరీ ఉన్నారు. ఈ కమిటీ ఆగస్టు 4న రాష్ట్ర మంత్రివర్గానికి తన నివేదికను సమర్పించనుంది. ఆ తరువాత క్యాబినెట్ సమావేశంలో నివేదికలోని సూచనలు, సిఫార్సులపై చర్చించనున్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.