నారద వర్తమాన సమాచారం
45.50 క్వింటాళ్ళ పి.డి.యస్. బియ్యాన్ని సీజ్ చేసి సంబందితులపై 6A కేసులు నమోదు చేసిన అధికారులు
జిల్లా సంయుక్త కలెక్టర్, పల్నాడు వారి ఆదేశాల మేరకు జిల్లా పౌర సరఫరాల అధికారి మరియు తహశీల్దార్లు, పౌర సరఫరాల ఉప తహశీల్దార్లు, రెవిన్యూ ఇన్స్ పెక్టర్ లు బృందాలుగా ఏర్పడి ఈ నెల 1 మరియు 2 వ తేదీలలో జిల్లా లోని పలు రేషన్ షాపులు మరియు వినుకొండ లోని రైస్ మిల్లులపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించి నిత్యావసర సరుకులలో వ్యత్యాసాలు ఉన్నందున రొంపిచర్ల మండలమునకు సంబంధించి 29 వ షాపు, ఈపూరు మండలమునకు సంబంధించి 11 వ షాపు, బొల్లాపల్లిలోని రేమిడిచర్ల గ్రామ చౌక ధరల దుకాణము నెంబరు 38 లపై మరియు వినుకొండ లోని సాయి బాలాజీ రైస్ మిల్లులో ఎటువంటి పత్రాలు లేకుండా నిల్వ ఉంచిన 45.50 క్వింటాళ్ళ పి.డి.యస్. బియ్యాన్ని సీజ్ చేసి సంబందితులపై 6A కేసులు నమోదు చేయడం జరిగినది.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.