నారద వర్తమాన సమాచారం
సత్య కృష్ణ గ్రానైట్ క్వారీలో ఘోర ప్రమాదం?
ఆంధ్రప్రదేశ్ లోని బాపట్ల జిల్లాలో ఆదివారం ఉదయం ఘోర ప్రమాదం చోటు చేసుకుంది, జిల్లాలోని బల్లికురవ సమీపంలోని సత్యక్రిష్ణ గ్రానైట్ క్వారీలో ప్రమాదం జరిగింది. గ్రానైట్ క్వారీ అంచు విరిగిపడి ఆరుగురు మృతి చెందారు. ప్రమాద సమయంలో క్వారీలో పనిచేస్తున్న 16 మంది కార్మికులు ఉన్నారు. మృతులు ఒడిశా వాసులుగా ప్రాథమికంగా గుర్తించారు. ఘటనాస్థలిలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
ఇప్పటి వరకు 4 మృత దేహాలను వెలికి తీశారు. తీవ్రంగా గాయపడిన మరో 8 మంది కార్మికులను మెరుగైన వైద్యం కోసం నరసరావుపేట ఆసుపత్రికి తరలించారు. వారిలో పలువురి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వైద్యులు తెలిపారు.
క్వారీ యాజమాన్యం భద్రతా చర్యలు చేపట్టలేదని అధికారులు భావిస్తున్నారు. క్వారీ ప్రమాద ఘటనపై బాపట్ల జిల్లా కలెక్టర్, ఎస్పీ స్థానిక అధికారులతో మాట్లాడారు. సహాయక చర్యలు వేగవంతం సూచించారు.
ఘటనపై సీఎం చంద్రబాబు విచారం: బాపట్ల జిల్లా బల్లికురవ క్వారీలో జరిగిన ప్రమాద ఘటనపై సీఎం చంద్రబాబు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. క్వారీలో పనులు చేస్తున్న కార్మికు లపై రాళ్లు పడడంతో పలువురు మృతి చెందారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.