నారద వర్తమాన సమాచారం
ఏపీ ప్రభుత్వం కొత్త స్మార్ట్ రేషన్ కార్డులను ఈనెల 25 నుండి పంపిణీ చేయనుంది
ఆంధ్ర ప్రదేశ్ :
కొత్త ‘స్మార్ట్’ రేషన్ కార్డులను ప్రభుత్వం ఈ నెల 25 నుంచి 31వ తేదీ వరకు పంపిణీ చేయనుంది.
ATM తరహాలో ఉండే ఈ కార్డులపై ఒకవైపు ప్రభుత్వ అధికారిక చిహ్నం, మరోవైపు కుటుంబ పెద్ద ఫొటో ఉంటాయి.
వచ్చే నెల నుంచి ఈ కార్డులపైనే రేషన్ పంపిణీ చేస్తారు.
గిరిజన ప్రాంతాల్లో రేషన్ డిపోలకు దూరంగా ఉన్న వారికి ఇంటి వద్దే సరుకులు ఇస్తామని మంత్రి మనోహర్ తెలిపారు. ఇందుకోసం 69 మినీ రేషన్ డిపోలను ఏర్పాటు చేస్తామన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.