నారద వర్తమాన సమాచారం
స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలో ప్రసంగించనున్న మంత్రి నాదెండ్ల మనోహర్
: జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు
నరసరావు పేట,
ఈ సంవత్సరం కలెక్టరేట్ పరేడ్ గ్రౌండ్స్ లో నిర్వహించనున్న 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలలో రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ జిల్లా ప్రగతి నివేదికను చదివి వినిపించనున్నారని జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు వెల్లడించారు.
ఏడాది కాలంలో ఏం చేశాం, రానున్న రోజుల్లో ఏం చేయనున్నామో చెబుతూ ప్రగతి నివేదికల తయారీ, శకటాల నిర్మాణం చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ప్లాస్టిక్ రహిత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు సిద్ధం కావాలన్నారు
స్థానిక కలెక్టరేట్ లోని పీజీఆర్ఎస్ సమావేశ మందిరంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సన్నద్ధతపై సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో డీఆర్వో మురళి, అదనపు ఎస్పీ జె.వి సంతోష్, ఆర్డీవో మధులత, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.