నారద వర్తమాన సమాచారం
స్త్రీ శక్తి పథకం తో పాటుగా కర్నూలుకు బస్సు సర్వీసు కొనసాగించాలి..
మాచర్ల డిపో గత 20 సంవత్సరాల నుండి నడుపుతున్న కర్నూలు సింగిల్ ఎక్స్ ప్రెస్ (టిమ్ ) సర్వీసు పునరుద్ధరించాలని ప్రయాణికులు కోరుతున్నారు. గతంలో గురజాల- మాచర్ల ప్రాంతవాసులు రాయలసీమకు వెళ్లేందుకు ఎక్స్ ప్రెస్ సర్వీస్ ఉపయోగకరంగా ఉంది.
గత వైసీపీ ప్రభుత్వంలో కర్నూలు బస్సును నిలుపుదల చేశారు.
కర్నూలు బస్ సర్వీసు పునరుద్ధరణకు రవాణా శాఖ మంత్రివర్యులు ఎం. రాంప్రసాద్ రెడ్డి, మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయులు,ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణ, నెల్లూరు జోనల్ 3 సురేష్ రెడ్డి, మేనేజింగ్ డైరెక్టర్ ద్వారక తిరుమల రావు, రవాణా ముఖ్య కార్యదర్శి కాంతిలాల్ దండే, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ జి. నాగేంద్ర ప్రసాద్, మాచర్ల డిపో మేనేజర్ బత్తుల వీరాస్వామి, నరసరావుపేట డి పి టి ఓ అజిత్ కుమారి లు చొరవ చూపాలని ప్రయాణికులు కోరుతున్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.