నారద వర్తమాన సమాచారం
చనిపోయిన ఓటర్లతో టీ తాగే ఛాన్స్ ఇచ్చిన ఈసీకి థాంక్స్..
రాహుల్ వ్యంగ్యాస్త్రం
బిహార్లో ఓటర్ల జాబితాలో లోపాలపై లోక్సభ ప్రతిపక్షనేత, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు చేశారు. ‘ చనిపోయిన’ ఓటర్లతో చాయ్ తాగానంటూ తాజాగా ‘ఎక్స్’ వేదికగా ఓ వీడియో పోస్ట్ చేశారు. ఈ ప్రత్యేకమైన అనుభవాన్ని అందించినందుకు ఎన్నికల సంఘానికి ధన్యవాదాలు అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. బతికి ఉన్నప్పటికీ, బిహార్ ముసాయిదా ఓటరు జాబితాలో ‘మృతిచెందినట్లు’గా తేలిన పలువురు ఓటర్లను రాహుల్ గాంధీ దిల్లీలోని తన నివాసానికి పిలిపించి మాట్లాడారు. అనంతరం దీనికి సంబంధించిన వీడియోను పోస్ట్ చేశారు. జీవితంలో అనేక ఆసక్తికర అనుభవాలు ఉన్నప్పటికీ, ‘చనిపోయిన’ వారితో టీ తాగే ఛాన్స్ ఎప్పటికీ రాలేదు. ఈ ప్రత్యేక అనుభవం కల్పించిన ఎన్నికల సంఘానికి ధన్యవాదాలు’’ అని రాసుకొచ్చారు. బిహార్లో ఓట్లను చోరీ కానివ్వబోమని తెలిపారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.