నారద వర్తమాన సమాచారం
నిరంతరం విద్యుత్తు సరఫరా అందించటానికి పని చేస్తాం.
అంతరాయాలు లేకుండా నిరంతరం విద్యుత్తును వినియోగదారులకు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఏపీ సీపీడీసీఎల్ సీఎండీ పుల్లారెడ్డి అన్నారు. మాచర్ల సబ్ డివిజన్ విద్యుత్తు ఉపకేంద్రాల పరిశీలన చేపట్టిన ఆయన కేసీపీ అతిథి గృహంలో విలేకరులు తో మాట్లాడారు. ప్రజలు సకాలంలో విద్యుత్తు బిల్లుల చెల్లింపుల తోపాటు బకాయిలు లేకుండా చూడాలని, విద్యుత్తు శాఖ అభివృద్ధికి సహకరించాలని కోరారు. మాచర్ల నియోజకవర్గంలో 200 నియంత్రి కలు చోరులు అపహరించడంతో రూ.2 కోట్ల మేర నష్టం వాటిల్లింద న్నారు. విద్యుత్తు వినియోగంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరిస్తామని, వర్షాలు పడుతున్న నేపథ్యంలో సిబ్బంది అప్రమ త్తంగా ఉండాలని సూచించారు. విద్యుత్తు శాఖలో సిబ్బంది కొరత ఎక్కువగా ఉందని, భర్తీ చేసేందుకు చర్యలు చేపడుతున్నట్లు వివరిం చారు. ఈ కార్యక్రమంలో టెక్నికల్ డైరెక్టర్ మురళికృష్ణ యాదవ్, ఎస్ఈ విజయ్ కుమార్, ఎస్ఏఓ వెంకటేశ్వరరావు, ఈఈ సింగయ్య, ఏ ఏ ఓ లు పి సందీప్ కుమార్, చంద్రశేఖర రావు ఏడీఈలు వీరేశ్వర రావు, రామయ్య, సురేష్ కుమార్,ఏఈలు భగవాన,నాగేశ్వరరావు, మస్తాన్ వలి, సబ్ ఇంజనీర్ వసంత లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.