నారద వర్తమాన సమాచారం
ఎకరాకు రూ.10వేల నష్టపరిహారం.. మంత్రి ప్రకటన
తెలంగాణలో భారీ వర్షాలతో పంట నష్టపోయిన రైతులకు మంత్రి జూపల్లి కృష్ణారావు శుభవార్త చెప్పారు. ఎకరాకు రూ.10వేల నష్టపరిహారం చెల్లిస్తామని ప్రకటించారు. వర్షాలు, వరదలకు భారీగా పంట నష్టం జరిగిందని తెలిపారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నడూ పరిహారం చెల్లించలేదన్నారు. కాంగ్రెస్ సర్కార్ మానవతా దృక్పథంతో ఎకరాకు రూ.10వేలు ఇవ్వాలని నిర్ణయించిందని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పర్యటన సందర్భంగా తెలిపారు.








