నారద వర్తమాన సమాచారం
కీలకమైన బిల్లు ప్రవేశపెట్టిన లోక్ సభ…!
ఢిల్లీ
ఇవాళ లోక్సభ ముందుకు కీలక బిల్లు.. నేరం చేస్తే ప్రధానికైనా ఉద్వాసన కల్పించేలా కొత్త బిల్లు.. అరెస్టై 30 రోజులు జైలులో ఉంటే పదవి నుంచి ఉద్వాసన.. ప్రధాని, కేంద్రమంత్రి, సీఎం.. ఎవరినైనా తొలగించేలా కొత్త బిల్లు.. ఐదేళ్ల శిక్ష పడే నేరానికి పాల్పడి అరెస్టయితే అంతే సంగతులు.. నెల రోజులు నిర్బంధంలో ఉంటే 31వ రోజు పదవి పోయేలా బిల్లు.. 130వ రాజ్యాంగ సవరణ బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టనున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా..
తీవ్ర నేరం చేస్తే సీఎం/పీఎం పదవి నుంచి ఔట్!
ఐదేళ్లు, అంతకుమించి శిక్ష పడే అవకాశమున్న క్రిమినల్ కేసుల్లో అరెస్టై 30 రోజులు జైల్లో ఉంటే మంత్రులను పదవి నుంచి తొలగించే బిల్లును NDA ప్రభుత్వం నేడు లోక్సభలో ప్రవేశపెట్టనుంది. PMతో సహా మంత్రులు, రాష్ట్రంలో సీఎంతో పాటు మంత్రులు ఈ బిల్లు పరిధిలోకి వస్తారు. దీనికి అనుగుణంగా రాజ్యాంగ సవరణ చేయనుంది. రాజీనామా చేయకపోయినా కొత్త నిబంధన అమల్లోకి వస్తే పదవిని కోల్పోతారు. దీనిని ఖాంగ్రెస్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.