నారద వర్తమాన సమాచారం
ఆంధ్ర కేసరి టంగుటూరి జీవితం భావితరాలకు ఆదర్శం.టంగుటూరి జయంతి వేడుకల్లో జిల్లా కలెక్టర్ పి అరుణ్ బాబు
ఆగష్టు
ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా పని చేసిన ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు జీవితం భావి తరాలకు ఆదర్శమని జిల్లా కలెక్టర్ పి అరుణ్ బాబు తెలిపారు. శనివారం కలెక్టరేట్ లో టంగుటూరి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. టంగుటూరి ప్రకాశం పంతులు చిత్ర పటానికి పూల మాలలు వేసి జిల్లా కలెక్టర్,తదితరులు నివాళులర్పించారు.
పేదరికం లో పుట్టి , పూట కూళ్ళ లో పని చేస్తూ ఉన్నత విద్యావంతునిగా , పత్రికా సంపాదకుని గా, ప్రజా నాయకునిగా , స్వాతంత్ర్య సమర యోధునిగా, ముఖ్యమంత్రిగా ఎదిగి, సంపాదించిన దానిని ప్రజలకే పంచి, పేదవానిగా మరణించిన మహా నీయుడని వీరి జీవితం అందరికీ ఆదర్శమని కలెక్టర్ పేర్కొన్నారు.
సైమన్ గో బాక్ నినాదం తో బ్రిటిష్ వారికి ఎదురొడ్డి గుండె చూపిన ధైర్యశాలి అని పేర్కొన్నారు. రైతుల కోసం అనేక ప్రోజెక్టుల ను చేపట్టారని, వాటి ఫలాలను రైతులు నేడు అనుభవిస్తున్నారని తెలిపారు. యువతకు వారు చూపిన మార్గం ఆదర్శమని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో డి.ఆర్.ఓ , జిల్లా అధికారులు పాల్గొన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.