నారద వర్తమాన సమాచారం
ఈ నెల 30న విశ్వబ్రాహ్మణ నూతన కార్యవర్గం ఎన్నిక
మాచర్ల : ఈ నెల 30న విశ్వబ్రాహ్మణ నూతన కార్యవర్గం ఎన్నిక జరగనున్నట్లు ఆ సంఘం పట్టణ కన్వీనర్ గురజాల అప్పారావు తెలిపారు. ఆదివారం అప్పారావు మాట్లాడుతూ ఈనెల 28వ తేదీ వరకు ఎన్నికకు పోటీ చేసేవారికి నామినేషన్లు స్వీకరిస్తారన్నారు. పోటీకి సిద్ధమైన వారు మాచర్ల పట్టణంలో ఓటు, ఆధార్, కుల ధ్రువీకరణ పత్రంతో తోపాటు నామినేషన్ కు రూ.5 వేలు రుసుము చెల్లించి రసీదు పొందాల్సి ఉందన్నారు. షరాబు బజారులోని విశ్వబ్రాహ్మణ కళ్యాణమండపంలో పత్రాలను అందజేయాల్సి ఉందన్నారు. 22 సంవత్సరాలు పైబడిన స్త్రీ పురుషులు పోటీకి పాల్గొనడానికి అర్హులవుతారన్నారు. ఈ ఎన్నిక ఆంధ్రప్రదేశ్ విశ్వబ్రాహ్మణ రాష్ట్ర అధ్యక్షులు చేపూరి రామస్వామి, పల్నాడు జిల్లా అధ్యక్షులు సుతారం వాసు (రిజి : 563/1973)ఆధ్వర్యంలో నిర్వహించబడనని, వివరాలకు సెల్ నెం : 9492464919 అందుబాటులో ఉంచినట్టు ఆయన పేర్కొన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.