విద్యుత్తు శాఖలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన జె. ఏ. ఓ ఆశీర్వాదం కు ఘన సన్మానం…!
నారద వర్తమాన సమాచారం
79 వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా పల్నాడు సర్కిల్ ఏపీసీపీడీసీఎల్ లో అకౌంట్స్ విభాగం జె.ఎ.ఓ. ఆశీర్వాదం ఉత్తమ ప్రతిభకు గాను నాన్ మానిటరీ అవార్డుకు ఎంపికయ్యారు. ఈ మేరకు సూపరింటెండెంట్ ఇంజనీర్ విజయకుమార్ చేతుల మీదుగా ఆయన అవార్డును అందుకున్నారు.
ఈ సందర్భంగా సబ్ ఈ ఆర్ ఓ, సబ్ డివిజన్, ఏఈ ఆపరేషన్ సారధ్యంలో జూనియర్ అకౌంట్ ఆఫీసర్ కె. ఆశీర్వాదాన్ని ఘనముగా శాలువా తో ఏ. ఏ. ఓ పి. సందీప్ కుమార్ సన్మానించారు.
ఈ కార్యక్రమంలో ఏ. ఏ .ఓ పి. సందీప్ కుమార్, డి ఈ ఈ టి. వీరేశ్వర రావు, ఏఈలు బి. భగవాన్, డి. నాగేశ్వరరావు, సబ్ ఇంజనీర్ వసంత లక్ష్మి, ఈ ఆర్ ఓ, ఆపరేషన్ సిబ్బంది పాల్గొన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.