నారద వర్తమాన సమాచారం
లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడిన ఏ ఈ..
నంద్యాల జిల్లా: ఆళ్లగడ్డ.
ఆళ్లగడ్డ రహదారులు భవనాలు శాఖ డివిజన్ అసిస్టెంట్ ఇంజనీర్గా పనిచేస్తున్న దూదేకుల దస్తగిరి సోమవారం జిల్లా అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు లంచం తీసుకుంటుండగా వల పని పట్టుకున్నారు.ACB డీఎస్పీ సోమన్నమీడియాతోమాట్లాడుతూ, ఆప్టిక్ ఫైబర్ కేబుల్ పని కోసం కాంట్రాక్టర్ నుండి AE దస్తగిరి ₹55,000 లంచం డిమాండ్ చేశారు అని తెలిపారు. బాధితుడు రమేష్ మొదట ₹40,000 నగదు ఇచ్చాడు, మిగిలిన ₹15,000 కోసం AE మళ్లీ డిమాండ్ చేయగా, ఫిర్యాదు చేశారు.ఈ ఫిర్యాదు మేరకు ACB అధికారులు దస్తగిరిని రెడ్ హ్యాండెడ్గా గుర్తించి, లంచం తీసుకోవడానికిప్రయత్నిస్తున్నప్పుడు దాడి చేసి కేసు నమోదు చేశారు అని డీఎస్పీ సోమన్న తెలిపారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.