Tuesday, October 14, 2025

మహాత్మా గాంధీజీ కి నివాళులర్పించిన సమన్వయకర్త డాక్టర్ గజ్జల

నారద వర్తమాన సమాచారం

మహాత్మా గాంధీజీ కి నివాళులర్పించిన సమన్వయకర్త డాక్టర్ గజ్జల

జాతిపిత మహాత్మ గాంధీజీ జయంతిని పురస్కరించుకొని ముందుగ
సత్తెనపల్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో గాంధీజీ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించిన
సత్తెనపల్లి నియోజకవర్గ
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త
డాక్టర్ గజ్జల సుధీర్ భార్గవ రెడ్డి
అనంతరం రైల్వే స్టేషన్ రోడ్డు సబ్ జైలు వద్ద ఉన్న గాంధీజీ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు.
అనంతరం గాంధీ చౌక్ వద్ద ఉన్న గాంధీజీ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా సుధీర్ భార్గవ రెడ్డి మాట్లాడుతూ
భారతదేశానికి స్వాతంత్య్రం సాధించిన నాయకులలో అగ్రగణ్యుడు గాంధీజీ అని ప్రజలు ఆయన్ను మహాత్ముడని జాతిపిత అని గౌరవిస్తారు.
సత్యము అహింసలు గాంధీ నమ్మే సిద్ధాంత మూలాలని
సహాయ నిరాకరణ సత్యాగ్రహము గాంధీజీ ఆయుధాలనీ మురికివాడలు శుభ్రం చేసి అన్ని మతాలూ కులాలూ ఒకటే అని చాటాడని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర జిల్లా నియోజకవర్గ పట్టణ మండల గ్రామ వార్డు పార్టీ అనుబంధ విభాగాల బాధ్యులు ప్రజాప్రతినిధులు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.


Discover more from

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

You cannot copy content of this page

Discover more from

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading