నారద వర్తమాన సమాచారం
డిప్యూటీ సీఎంను కలిసిన బుద్ధప్రసాద్
సదాస్మరామి గ్రంథం బహుకరణ
నియోజకవర్గ అభివృద్ధిపై చర్చ
అవనిగడ్డ:
అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత కొణిదెల పవన్ కళ్యాణ్ ను కలిశారు.అమరావతిలోని ఉప ముఖ్యమంత్రి కార్యాలయంలో ఆయనను కలసి తాను రచించిన సదాస్మరామి గ్రంధాన్ని బహుకరించారు.తెలుగు జాతిలో జన్మించిన మహోన్నత ప్రముఖులను స్మరించుకుంటూ ఈ గ్రంథం రచించినట్లు బుద్ధప్రసాద్ తెలిపారు.
తెలుగు జాతిలో స్ఫూర్తిగా నిలిచే మహోన్నత వారసత్వాన్ని భావితరాలకు అందించేందుకు ఈ గ్రంథం రచించినట్లు తెలిపారు.ఈ సందర్భంగా నియోజవర్గంలో పలు అభివృద్ధి పనులపై ఆయనతో చర్చించారు.త్వరలో నియోజవర్గంలోని ఎదురు మొండి దీవుల్లో పలు అభివృద్ధి పనులకు పవన్ కళ్యాణ్ విచ్చేయనున్న సందర్భంగా పర్యటన గురించి ఆయనతో చర్చించారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.