నారద వర్తమాన సమాచారం
బైక్ ఇవ్వలేదని పోలీస్ స్టేషన్ నుంచి జీపు ఎత్తుకెళ్లిన మందుబాబు!
కర్నూలు జిల్లా ఆలూరుకు సమీపంలోని గ్రామానికి చెందిన యువరాజు అనే వ్యక్తిని బుధవారం రాత్రి పోలీసులు డ్రంకెన్ డ్రైవ్ కేసులో పట్టుకున్నారు. అతడి బైక్ను స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం ఉదయం పోలీస్ స్టేషన్కు వచ్చిన యువరాజు, తన బైక్ను తిరిగి ఇవ్వాలని పోలీసులను కోరాడు. వారు నిరాకరించడంతో, “నా బైక్ ఇవ్వకపోతే మీ జీపు తీసుకెళ్లిపోతా” అని హెచ్చరించాడు.అతడు మద్యం మత్తులో మాట్లాడుతున్నాడని భావించిన పోలీసులు ఆ మాటలను తేలిగ్గా తీసుకున్నారు. అయితే, చెప్పినట్టుగానే యువరాజు అక్కడే ఉన్న సీఐ జీపును తీసుకుని తన ఊరికి వెళ్లిపోయాడు. ఇంటికి వెళ్లిన తర్వాత తీవ్రమైన మత్తులో ఉండటంతో మాట్లాడలేని స్థితిలో పడిపోయాడు. కాసేపటి తర్వాత ఇది గమనించిన అతడి సోదరుడు అంజి, వెంటనే జీపును తిరిగి పోలీస్ స్టేషన్కు తీసుకొచ్చాడు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.







