Wednesday, December 3, 2025

నేర ప్రవృత్తిని విడనాడి సమాజంలో మంచి పౌరులుగా జీవించాలి.. పల్నాడు జిల్లా పోలీసులు..

నారద వర్తమానం సమాచారం

నేర ప్రవృత్తిని విడనాడి సమాజంలో మంచి పౌరులుగా జీవించాలి….

రౌడీ షీటర్లు మరియు నేర చరిత్ర గల వారి కదిలికలపై నిరంతరం నిఘా…..

చట్ట వ్యతిరేక కార్యకలాపాలలో పాల్గొంటే కఠిన చర్యలు తప్పవు….

పల్నాడు జిల్లా ఎస్పీ బి. కృష్ణారావు ఐపీఎస్  ఆదేశాలమేరకు పల్నాడు జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్ ల పరిధులలో రౌడీషీటర్లు, నేరచరిత్ర కలవారికి పోలీస్ అధికారులు కౌన్సిలింగ్ నిర్వహించడం జరిగింది.

రౌడీ షీట్లు కలిగిన వ్యక్తుల ప్రవర్తన, వారు నిర్వహించే పనులు వారి జీవన విధానంపై నిఘా ఉంటుందని కౌన్సిలింగ్ కు వచ్చిన వారికి పోలీసు అధికారులు తెలియజేశారు.

సత్ప్రవర్తనతో జీవించాలని, నేర ప్రవృత్తిని మానుకొని సమాజంలో మంచి పౌరులుగా జీవించాలని, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని,ఎవరైనా పోలీస్ వారి సూచనలను బేఖాతరు చేసిన అట్టి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు.

చట్ట వ్యతిరేక కార్యకలాపాలలో పాల్గొంటే తప్పనిసరిగా చట్ట ప్రకారం కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ముఖ్యంగా నరసరావుపేట సబ్ డివిజన్ ఆఫీసు నందు ఎం హనుమంతరావు  ఆధ్వర్యంలో నరసరావుపేట 1వ పట్టణ, 2వ పట్టణ, నరసరావుపేట రూరల్, చిలకలూరిపేట టౌన్, వినుకొండ టౌన్, వినుకొండ రూరల్, ఈపూరు, శావల్యాపురం
నుండి హాజరు అయిన రౌడీషీటర్ల కు ప్రత్యేకంగా కౌన్సిలింగ్ ద్వారా హెచ్చరించడం జరిగింది.


Discover more from

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

You cannot copy content of this page

Discover more from

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading