నారద వర్తమాన సమాచారం
పి.జి.ఆర్.ఎస్ ను ప్రజలు వినియోగించుకోవాలి
పి.జి.ఆర్.ఎస్ అర్జీ స్థితిని 1100 కు ఫోన్ చేసి తెలుసుకోవచ్చు
“మీకోసం” వెబ్ సైట్ లో పి.జి.ఆర్.ఎస్ అర్జీలు
ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పి.జి.ఆర్.ఎస్) ను ప్రజలు వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా కోరారు. పి.జి.ఆర్.ఎస్ లో సమర్పించిన అర్జీల స్థితిని 1100 టోల్ ఫ్రీ ఫోన్ నంబర్ కు ఫోన్ చేసి తెలుసుకోవచ్చని తెలిపారు. అర్జీలను మీకోసం వెబ్ సైట్ లోను సమర్పించవచ్చని చెప్పారు.
ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పి.జి.ఆర్.ఎస్) లో నేరుగా అందించవచ్చని, అదేవిధంగా అర్జీలను మీకోసం వెబ్ సైట్ లోను సమర్పించే వెసులుబాటును ప్రభుత్వం కల్పించిందని అన్నారు.
ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. పి.జి.ఆర్.ఎస్
కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయంలోను, మండల కార్యాలయాలలోను ప్రతి సోమవారం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. పి.జి.ఆర్.ఎస్ లో సమర్పించిన అర్జీల వివరాలను 1100 టోల్ ఫ్రీ నంబరుకు ఫోన్ చేసి తెలుసుకోవచ్చని జిల్లా కలెక్టర్ తెలిపారు. అర్జీల వివరాలు
Meekosam.ap.gov.in
(మీకోసం డాట్ ఏపీ డాట్ జివో వి డాట్ ఇన్) వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చని చెప్పారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంతో సహా అన్ని కార్యాలయాల్లో ప్రజల సమస్యలు సోమవారం స్వీకరించడం జరుగుతుందని తెలిపారు. ప్రభుత్వం కల్పించిన అవకాశాన్ని ప్రజలు
వినియోగించుకోవాలని కోరారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.







