Friday, January 16, 2026

కార్ల కు నకిలీ నెంబర్ ప్లేట్లు మారుస్తూ మోసాలకు పాల్పడుతున్న నలుగురు ముద్దాయి లను అరెస్టు చేసిన నరసరావుపేట రూరల్ పోలీసులు

నారద వర్తమాన సమాచారం

కార్ల కు నకిలీ నెంబర్ ప్లేట్లు మారుస్తూ మోసాలకు పాల్పడుతున్న నలుగురు ముద్దాయి లను అరెస్టు చేసిన నరసరావుపేట రూరల్ పోలీసులు

22.12.2025న నరసరావుపేట రూరల్ పి.ఎస్ నందు నిర్వహించిన మీడియా సమావేశంలో దొంగల అరెస్ట్ వివరాలను వెల్లడించిన పల్నాడు జిల్లా ఎస్పీ  బి. కృష్ణారావు ఐపిఎస్

ఈ నెల 12 న విజయవాడకి చెందిన శ్రీనివాసరెడ్డి తన కారు పోయిందని ఫిర్యాదు చేశారు.

నరసరావుపేట రూరల్ పోలీస్ స్టేషన్ నందు కేసు నమోదు చేయడం జరిగింది.

ఫైనాన్స్ చెల్లించే క్రమంలో ఈ కార్లు చోరీలకు పాల్పడుతున్నారు. ఈ మొత్తం వ్యవహారంలో తొమ్మిది మంది పాత్ర ఉన్నట్లు విచారణలో తేలింది. వెంకట నాయుడు, అంజి,భాను ప్రకాష్,రఫీ లను ఇప్పటికే అరెస్ట్ చేసినట్లు తెలిపారు.

కేసులో ప్రమేయం ఉన్న మిగిలిన నిందితులను త్వరలోనే అరెస్ట్ చేస్తాం.

ప్రస్తుతం 20 కార్లను స్వాధీనం చేసుకోవడం జరిగింది.

ఫైనాన్స్ లో కార్లు కొనుగోలు చేసి తిరిగి డబ్బులు చెల్లించని వారి నుండి కార్లు తీసుకుని నంబర్ ప్లేట్లు మార్చుకొని తిరగడం జరుగుతుంది. మొత్తం 20 కార్లను నిందితులు అందరూ కలిసి కార్లను తాకట్టు పెట్టుకునే క్రమంలో ఒకరికొకరు సహకరించుకుంటూ ఒక ముఠాగా ఏర్పడి కార్ల తాకట్టు ద్వారా, అద్దెల ద్వారా, ఫైనాన్స్ ఎగ్గొట్టడం ద్వారా వచ్చిన డబ్బులను సమానంగా పంచుకొని త్రాగి తిరుగుకుంటూ కార్లకు సంబంధించిన కాగితాలను వారికి హైదరాబాద్ కు చెందిన ప్రకాష్ గౌడ్, మోహన సత్య శ్రీనివాస్ మరియు వైజాగ్ కు చెందిన వర్మలు వారికి పంపించి సహకరిస్తున్నట్లు, నిందితులు తాకట్టు పెట్టుకున్న కార్లకు శ్రీరామ్ ఫైనాన్స్, మహావీర్ ఫైనాన్స్, IKF ఫైనాన్స్, IDFC First Bank Limited ఫైనాన్స్ వద్ద నుండి ఫైనాన్స్ తీసుకుని అందుకు సంబంధించిన వడ్డీ లను కట్టకుండా, నెలవారీ కిస్తీ లను కూడా ఎగ్గొట్టుటకు మరియు ఆ డబ్బును ఎక్కువ వడ్డీలకు ఇస్తూ అధిక వడ్డీలకు వాహనాలు అమ్ముట, నెలవారీ కిస్తీలు కట్టకుండా ఎగవేస్తూ ఉంటారు. అంతేకాకుండా నిందితులు అందరూ ఫైనాన్స్ వారికి దొరకకుండా నెంబర్ ప్లేట్లు మార్చి కొత్త నెంబర్లు వేస్తూ మరియు ఏదైనా పాడైపోయిన వాహనాల యొక్క రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ వేసి వాహనాలను తిప్పుతూ వచ్చిన ఆదాయమును అందరూ సమానంగా పంచుకుంటూ ఉంటున్నట్లు, అంతేకాకుండా అవకాశం కుదిరినప్పుడు కార్ల యొక్క ఇంజన్ నెంబర్లు మరియు ఛాసిస్ నెంబర్లు మార్చాలని అనుకొని కొన్ని కార్ల నెంబర్లు మరియు యజమానుల చిరునామాలు మార్చినట్లు, సదరు కార్ల యజమానులు కార్లు ఇవ్వమని దానికి సంబంధించిన అసలు వడ్డీ కంటే కూడా ఎక్కువ వడ్డీ ఇవ్వమని డిమాండ్ చేస్తూ వారు అంత వడ్డీ ఇవ్వలేము అంటే వారిని బెదిరించి వారి వద్ద నుండి బలవంతంగా అగ్రిమెంట్లు తీసుకుంటున్నట్లు, అదే విధంగా నిందితులు 20 కార్లను తీసుకొని వాటిలో కొన్నిటిని నెంబర్లు మార్చి, కొన్నిటికి ఫైనాన్స్ ఎగ్గొట్టి, ఒక వాహనం రిజిస్టర్ నెంబర్ మరొక వాహనానికి మార్చినట్లు విచారణలో తేలింది.

మొత్తం 20 కార్లను నిందితులు అందరూ కలిసి కార్లను తాకట్టు పెట్టుకునే క్రమంలో ఒకరికొకరు సహకరించుకుంటూ ఒక ముఠాగా ఏర్పడి కార్ల తాకట్టు ద్వారా, అద్దెల ద్వారా, ఫైనాన్స్ ఎగ్గొట్టడం ద్వారా వచ్చిన డబ్బులను సమానంగా పంచుకొని త్రాగి తిరుగుకుంటూ కార్లకు సంబంధించిన కాగితాలను వారికి హైదరాబాద్ కు చెందిన ప్రకాష్ గౌడ్, మోహన సత్య శ్రీనివాస్ మరియు వైజాగ్ కు చెందిన వర్మలు వారికి పంపించి సహకరిస్తున్నట్లు, నిందితులు తాకట్టు పెట్టుకున్న కార్లకు శ్రీరామ్ ఫైనాన్స్, మహావీర్ ఫైనాన్స్, IKF ఫైనాన్స్, IDFC First Bank Limited ఫైనాన్స్ వద్ద నుండి ఫైనాన్స్ తీసుకుని అందుకు సంబంధించిన వడ్డీ లను కట్టకుండా, నెలవారీ కిస్తీ లను కూడా ఎగ్గొట్టుటకు మరియు ఆ డబ్బును ఎక్కువ వడ్డీలకు ఇస్తూ అధిక వడ్డీలకు వాహనాలు అమ్ముట, నెలవారీ కిస్తీలు కట్టకుండా ఎగవేస్తూ ఉంటారు. అంతేకాకుండా నిందితులు అందరూ ఫైనాన్స్ వారికి దొరకకుండా నెంబర్ ప్లేట్లు మార్చి కొత్త నెంబర్లు వేస్తూ మరియు ఏదైనా పాడైపోయిన వాహనాల యొక్క రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ వేసి వాహనాలను తిప్పుతూ వచ్చిన ఆదాయమును అందరూ సమానంగా పంచుకుంటూ ఉంటున్నట్లు, అంతేకాకుండా అవకాశం కుదిరినప్పుడు కార్ల యొక్క ఇంజన్ నెంబర్లు మరియు ఛాసిస్ నెంబర్లు మార్చాలని అనుకొని కొన్ని కార్ల నెంబర్లు మరియు యజమానుల చిరునామాలు మార్చినట్లు, సదరు కార్ల యజమానులు కార్లు ఇవ్వమని దానికి సంబంధించిన అసలు వడ్డీ కంటే కూడా ఎక్కువ వడ్డీ ఇవ్వమని డిమాండ్ చేస్తూ వారు అంత వడ్డీ ఇవ్వలేము అంటే వారిని బెదిరించి వారి వద్ద నుండి బలవంతంగా అగ్రిమెంట్లు తీసుకుంటున్నట్లు, అదే విధంగా నిందితులు 20 కార్లను తీసుకొని వాటిలో కొన్నిటిని నెంబర్లు మార్చి, కొన్నిటికి ఫైనాన్స్ ఎగ్గొట్టి, ఒక వాహనం రిజిస్టర్ నెంబర్ మరొక వాహనానికి మార్చినట్లు విచారణలో తేలింది.

ఈ దర్యాప్తులో దిశా నిర్దేశం చేసినటువంటి నరసరావుపేట డిఎస్పి M. హనుమంతరావు ని, దర్యాప్తు చేసిన నరసరావుపేట రూరల్ సీఐ MV. సుబ్బారావు ని, నరసరావుపేట రూరల్ ఎస్సై Ch. కిషోర్ ని, ఎస్సై R. శ్రీకాంత్ ని, ఎస్సై SK. ఫాతిమా ని మరియు సిబ్బందిని జిల్లా ఎస్పీ బి.కృష్ణారావు, ఐపీఎస్  అభినందించారు.


Discover more from

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

You cannot copy content of this page

Discover more from

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading