గూడూరు వార్డు సుభ్యునిగా ప్రజా వాయిస్ జర్నలిస్ట్ కట్టేబోయిన శ్రీను.
ప్రమాణస్వీకారం చేసి బాధ్యతలు స్వీకరించిన శ్రీను,వసంత, సాయికృష్ణ,శ్యామ్.
శుభాకాంక్షలు తెలిపిన జిల్లా స్టాఫ్ రిపోర్టర్ నడ్డి శివకృష్ణ యాదవ్.
నారద వర్తమాన సమాచారం
మిర్యాలగూడ
శంకర్
నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండల గూడూరు గ్రామ వార్డు సుభ్యులుగా కట్టేబోయిన శ్రీను, నూకపంగు వసంత, కాంపెల్లి సాయి కృష్ణ, నూకపంగు శ్యామ్ మంగళవారం ఉదయం నిమిషాలకు పదవీ బాధ్యతలు స్వీకరించారు.ఈ సందర్భంగా కట్టేబోయిన శ్రీను మాట్లాడుతు మాకు అవకాశం కల్పించిన గ్రామ ప్రజలకు, పెద్దలకు కృతజ్ఞతలు తెలియజేస్తూ, రాజకీయాలకు కులమతాలకు అతీతంగా గ్రామ అభివృద్ధికి నిరంతరం తోడ్పడత అని, సమస్య ఎక్కడ వచ్చిన వెంటనే స్పందిస్తామని అన్నారు. మరి ముఖ్యంగా మా విజయానికి తోడ్పడ్డ ప్రతిఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు విజయానికి తోడ్పడు అందించిన గ్రామ పెద్దలకు యువకులకు సన్మాన కార్యక్రమం చేశారు.శాలువాలతో సన్మానించారు,గ్రామమంతా సందడి వాతావరణం నెలకొన్నది. నల్గొండ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ నడ్డి శివకృష్ణ యాదవ్ ప్రమాణ స్వీకారానికి హాజరై శుభాకాంక్షలు తెలిపారు.
. ఈ కార్యక్రమంలో, పంచాయతీ కార్యదర్శి రాజశేఖర్, గ్రామ పెద్దలు,మాజీ సర్పంచ్ విక్టోరియా శ్రీనివాస్,బొడ్డు సైదులు,ముగల ముసలయ్య తదితరులు హాజరయ్యరు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.







