తెలుగు జాతి హృదయాల్లో చిరస్మనీయుడు ఎన్టీఆర్ వర్ధంతి వేడుకల్లో టీడీపీ రాష్ట్ర నాయకులు జడ రాములు యాదవ్
మిర్యాలగూడ
నారద వర్తమాన సమాచారం
ప్రతినిధి : శంకర్
సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అనే సిద్దాంతంతో ముందుకు సాగిన ఏకైక నాయకుడు స్వర్గీయ నందమూరి తారకరామారావు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు, వేములపల్లి పిఏసీఎస్ చైర్మన్కొ జడ రాములు యాదవ్ కొనియాడారు వేములపల్లి లో ఎన్టీఆర్,తెలుగుదేశం ఆభిమానులు,ఆదివారం ఎన్టీఆర్ 30వ వర్ధంతి సందర్బంగా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అభిమానులు,ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వన్నె తగ్గని కీర్తి, జనం మరవని ఖ్యాతి స్వర్గీయ నందమూరి తారకరామారావుది అన్నారు, తెలంగాణలో పటేల్ పట్వారి వ్యవస్థని రద్దుచేసి మండల వ్యవస్థను ఏర్పాటు చేశారని తెలుగు జాతి ఆత్మ గౌరవాని ప్రపంచపు నలు దిశలా చాటి చెప్పిన ఘనత.తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావుది అని కొనియాడారు. ఈ కార్యక్రమం లో నాయకులు ఎండీ జానిమియా, రసూల్, జయరామాచారీ, వేములపల్లి ఉప సర్పంచ్ గుండెబోయిన మల్లయ్య, వార్డు మెంబెర్స్, జడ మహేశ్వరి సైదులు, వలపట్ల మాధవి రమేష్, అంజయ్య గౌడ్,నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.







