నారద వర్తమాన సమాచారం
కలెక్టర్ కృతిక శుక్లాకు కృతజ్ఞతలు తెలిపిన పల్నాడు జిల్లా ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ మెంబర్ కుక్కమూడి ప్రసాద్
పల్నాడు జిల్లా కలెక్టర్ కృత్తిక శుక్లాకు
పల్నాడు జిల్లా ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ మెంబర్ మరియు దళిత బహుజన సంక్షేమ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షులు కుక్కమూడి ప్రసాద్ బాధితురాలు సూర్ల స్టెల్లా కృతజ్ఞతలు తెలిపారు.
శనివారం పల్నాడు జిల్లా నరసరావుపేట లోని కలెక్టర్ కార్యాలయం నందు కుక్కమూడి ప్రసాద్ ఆధ్వర్యంలో చిలకలూరిపేట ఏఎంజీ లో ఉంటూ రెండు చేతులు కాళ్లు లేని స్టెల్లాతో కలెక్టర్ కృత్తికా శుక్లాను కలిసి 15వేల రూపాయల పెన్షన్ మంజూరు చేయించాలని,
35 కేజీల బియ్యం ఇచ్చేలా చూడాలని, నివేశన స్థలం, ప్రభుత్వ ఉద్యోగం ఇప్పించాలని కోరుతూ పలు సమస్యలతో కూడిన అర్జీని ఆమెకు అందజేశారు.
ఈ సందర్భంగా ప్రసాద్ మాట్లాడుతూ
2026 ఫిబ్రవరి 21న స్వర్ణాంధ్ర స్వచ్ఛంధ్ర కార్యక్రమంలో భాగంగా వినుకొండకు ముఖ్యఅతిథిగా విచ్చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును ప్రజా వేదిక వద్ద బాధితురాలైన స్టెల్లా కలిసి పై సమస్యలను పరిష్కరించాలని, మానసికంగా,ఆర్థిక సమస్యలతో కొట్టుమిట్టులాడుతున్నానని విన్నవించుకోగా, ముఖ్యమంత్రి వెంటనే స్పందించి ఆమె సమస్యలను పరిష్కరించాలని కలెక్టర్ కు చెప్పారు. దానిలో భాగంగా ఈరోజు కలెక్టర్ ను కలవడం జరిగిందని
ఈ సమస్యలపై కలెక్టర్ కృతిక శుక్ల సానుకూలంగా స్పందించి ఇంటి పట్టా ఇవ్వాలని, 35 కేజీలు బియ్యం ఇచ్చే విధంగా చూడాలని, ఆమె చేయగలిగిన ప్రభుత్వ ఉద్యోగం త్వరలో ఇచ్చే విధంగా చూడాలని అధికారులను ఆమె ఆదేశించారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో వికలాంగు రాలైన స్టెల్లా సమస్యలను పరిష్కరించిన
పల్నాడు జిల్లా కలెక్టర్ కు అభినందనలు కృతజ్ఞతలు వారు తెలిపారు.
ఈకార్యక్రమంలో ఏపీ హ్యూమన్ రైట్స్ రాష్ట్ర అధ్యక్షులు గురజాల అప్పారావు, పల్నాడు జిల్లా ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ మెంబర్
(బాండెడ్ లేబర్) చింతపల్లి లాజర్ బాబు తదితరులు పాల్గొన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.









