నారద వర్తమాన సమాచారం
కోనసీమ జిల్లాలోజాలర్లకు చిక్కిన మొసలి!
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో గత ఆరు నెలలుగా రైతులను భయాందోళనకు గురి చేసిన మొసలి ఎట్టకేలకు పట్టుబడింది. పి. గన్నవరం సమీపంలోని అయినవిల్లి మండలం అయినవిల్లి లంకలోఆదివారం సాయంత్రం ఈ సంఘటన చోటుచేసుకుంది.
స్థానిక సమాచారం ప్రకా రం, గత ఏడాది వరదల సమయంలో ఈ ప్రాంతం లోకి మొసలి చేరింది. అప్పటి నుంచి నీటి మడుగులు, చెరువుల వద్ద సంచరిస్తూ రైతులు, జాలర్లలో భయాన్ని కలిగించింది. పొలం పనులకు వెళ్లే రైతులు భయంతో జంకేవారు .
మొసలిని పట్టుకునేందుకు అటవీ శాఖ అధికారులు పలుమార్లు ప్రయత్నించి నప్పటికీ అవి ఫలించలేదు. దీంతో అధికారులు కొంతకాలం తరువాత ప్రయత్నాలను నిలిపివేశారు. అయితే స్థానిక ప్రజలు మాత్రం ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో ఆదివారం సాయంత్రం చేపల వేటకు వెళ్లిన జాలర్ల వలకు ఆ మొసలి చిక్కింది.
వెంటనే వారు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న అధికారులు మొసలిని సురక్షితంగా పట్టుకుని అటవీ ప్రాంతానికి తరలిం చే ఏర్పాట్లు చేశారు. మొసలి పట్టుబడడంతో గత ఆరు నెలలుగా భయంతో జీవించిన రైతులు, స్థానిక ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనతో గ్రామంలో ఆనంద వాతావరణం నెలకొంది.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.








