నారద వర్తమాన సమాచారం:నరసరావుపేట:ప్రతినిధి
పల్నాడు జిల్లా,కలెక్టరేట్ లో ఎన్నికల సిబ్బంది మొదటి ర్యాండమైజేషన్ ప్రక్రియ
: జిల్లాలోని 7 నియోజకవర్గాలకు సంబంధించిన ఎన్నికల సిబ్బంది మొదటి ర్యాండమైజేషన్ పూర్తి
: పోలింగ్ పర్సనల్స్ ఎన్నికల శిక్షణా కార్యక్రమానికి తప్పనిసరిగా హాజరుకావాలి
: జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి లోతేటి శివశంకర్
కలెక్టరేట్ లోని యస్ ఆర్ శంకరన్ వీడియో కాన్ఫరెన్స్హాల్ లో ఎన్నికల సిబ్బంది మొదటి ర్యాండమైజేషన్ ప్రక్రియను జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ఆధ్వర్యంలో నిర్వహించారు. సోమవారం ఉదయం 11 గంటలకు జిల్లాలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన ఎన్నికల పీఓ, ఏపీఓల మొదటి ర్యాండమైజేషన్ ప్రక్రియను నిర్వహించడం జరిగింది.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి మాట్లాడుతూ పోలింగ్ పర్సనల్స్ ఎన్నికల శిక్షణా కార్యక్రమానికి తప్పనిసరిగా హాజరుకావాలని, ఈ విషయమై సంబంధిత రిటర్నింగ్ అధికారులు పోలింగ్ పర్సనల్స్ కి తెలియజేయాలన్నారు. ఎన్నికల శిక్షణకు సంబంధించిన ట్రైనింగ్ ఆర్డర్స్ పోలింగ్ పర్సనల్స్ అందరికీ రావడం జరుగుతుందని, పోలింగ్ పర్సనల్స్ అందరూ పోస్టల్ బ్యాలెట్ కోసం అవసరమైన ఫామ్ – 12 ని ఫిల్ చేసుకుని తీసుకుని శిక్షణకు వచ్చేలా వారికి ఆర్ఓలు స్పష్టంగా తెలపాలని ఆదేశించారు. జిల్లాలో 2,370 మంది పిఓ (ప్రిసైడింగ్ అధికారులు), 2,375 మంది ఏపిఓ (అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులు)లకు ఎన్నికల శిక్షణా కార్యక్రమాలు వివరించారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.