నారద వర్తమాన సమాచారం
గీత కార్మికులకు కేటాయించిన మధ్యం దుకాణాలను లాటరీ ద్వారా లైసెన్సులు మంజూరు చేసిన పల్నాడు జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు ఐఏఎస్.
నరసరావుపేట :
పల్నాడు జిల్లాలోని గీత కులాలకు కేటాయించిన 13 మద్యము దుకాణంలకు ది.06.03.2025 ఉదయం 09.00 గంటలకు జిల్లా కలెక్టర్ ఆఫీసు, నరసరావుపేట నందు గల PGRS హాల్లో డిస్ట్రిక్ కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్ పి. ఆరుణ్ బాబు ఐఏఎస్, సమక్షములో మద్యము షాపుల లాటరీని డ్రా తీసి లైసెన్సుదారులుగా ఎంపికైన అభ్యర్థులకు షాపులను కేటాయించటం జరిగింది. పల్నాడు జిల్లాలో గీత కులాలకు కేటాయించిన 13 మద్యం దుకాణాల లాటరీ ప్రక్రియ పూర్తయినట్లు, ఈ లాటరీ ప్రక్రియను వీడియో రికార్డింగ్ ద్వారా పారదర్శకంగా నిర్వహించటం జరిగిందని జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారి కె. మణికంఠ తెలియపరిచినారు. షాపులు దక్కించుకున్న లైసెన్స్ దారులు ఫీజు చెల్లించిన వారికి ప్రొవిజనల్ లైసెన్స్ అందజేయనున్నట్లు ఆయన తెలిపారు. ప్రతి మద్యము దకాణమునకు ఒక సెలెక్ట్ అప్లికెంట్ మరియు ఇద్దరు రిజర్వ్ అప్లికెంట్స్ లను కూడా ఎంపిక చేయటం జరిగింది. ఈ కార్యక్రమములో జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారి కె. మణికంఠ స్టేషన్ హౌస్ ఆఫీసర్స్, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సబ్- ఇన్స్పెక్టర్స్ మరియు సిబ్బంది, గౌడ కుల సంక్షేమ ప్రతినిధులు పాల్గొన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.