

ప్రజల కోసం ఏమైనా చేస్తా: ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి
నారద వర్తమాన సమాచారం: భూదాన్ పోచంపల్లి, ప్రతినిధి:
సేవ చేస్తాడని నమ్మకంతో ఆదరించి గెలిపించిన ప్రజల కోసం ఏమైనా చేస్తానని ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి అన్నారు. మండలంలోని దేశ్ ముఖి, పిల్లాయిపల్లి, జూలూరు, కప్రాయపల్లి, పెద్దగూడెం, పెద్ద రావులపల్లి, గౌస్ కొండ, శివారెడ్డి గూడెం గ్రామాల్లో లోక్ సభ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి గెలుపు కోసం శుక్రవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన సోనియాగాంధీ రుణం తీర్చుకోవాలంటే కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. తనపై నమ్మకంతోనే ఎంతోమంది కాంగ్రెస్ లో చేరుతున్నారన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తరువాత కేసీఆర్ కుటుంబమే బాగు పడిందే తప్ప ప్రజలకు ఎలాంటి లబ్ది చేకూరలేదని విమర్శించారు. భారాస, భాజాపాలతో రాష్ట్రానికి ఒరిగేది ఏమీ లేదన్నారు. నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు తడ్క వెంకటేశం, పాక మల్లేశం, సామ మధుసూదన్ రెడ్డి, సామ మోహన్ రెడ్డి, కళ్లెం రాఘవరెడ్డి, మల్లారెడ్డి, నరసింహారెడ్డి పాల్గొన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.