Tuesday, May 20, 2025

గిరిపుత్రులకు ఎల్లప్పుడూ అండగా నిలుస్తామని డా.చదలవాడ అరవింద బాబు హామీ

నారద వర్తమాన సమాచారం

గిరిజన ద్రోహిని గద్దె దించాలి

జీవో నెం.3ని తుంగలో తొక్కి గిరిజనులకు తీరని ద్రోహం చేసిన జగన్

గిరిపుత్రులకు ఎల్లప్పుడూ అండగా నిలుస్తామని డా.చదలవాడ అరవింద బాబు హామీ

గిరిపుత్రుల జీవన ప్రమాణాలు పెంచే ఏకైక నాయకుడు నారా చంద్రబాబు మాత్రమేనని ఎన్డీఏ కూటమి నరసరావుపేట ఎమ్మెల్యే అభ్యర్ధి డా.చదలవాడ అరవిందబాబు పేర్కొన్నారు.నరసరావుపేట పట్టణంలోని చంద్రబాబు నాయుడు కాలనీలో ఏర్పాటు చేసిన గిరిజన ఆత్మీయ సమావేశంలో ముఖ్య అతిధిగా పాల్గొన్నారు.గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నపుడు గిరిజనుల్ని ఆర్ధికంగా, సామాజికంగా,రాజకీయంగా అండగా నిలిచేందు అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తే వాటిని జగన్ రెడ్డి వచ్చి రద్దు చేశాడన్నారు.చివరికి ఉపాధ్యాయ నియామకాల్లో జీవో నెం.3ని తుంగలో తొక్కి గిరిజనుల హక్కుల్ని కాలరాశాడని మండిపడ్డారు.చంద్రబాబు ఉచిత విద్యుత్,భూమి కొనుగోలు,ఫీడర్ అంబులెన్సు లాంటి పథకాలతో ఏజెన్సీ,మైదాన ప్రాంతాల్లోని గిరిజనులకు అండగా నిలిస్తే..ఆ పథకాలన్నీ రద్దు చేసిన దుర్మార్గుడు జగన్ రెడ్డి మండిపడ్డారు.అతి సామాన్య జీవితం గడిపే గిరిజనుల పాలిట జగన్ రెడ్డి గాడ్జిల్లా మాదిరి వ్యవహరిస్తున్నాడన్నారు.ఏజెన్సీలో కాఫీతోటలు విస్తరించి గిరిజనులకు అప్పగించి వారికి మెరుగైన జీవనం కల్పిస్తే..గంజాయి అక్రమ సాగు,అక్రమ రవాణాలో గిరిజన యువకులను ఇరికించి వారి జీవితాలను జగన్ రెడ్డి ఛిద్రం చేస్తున్నాడని డా.చదలవాడ అరవింద బాబు ధ్వజమెత్తారు.మళ్లీ కూటమి అధికారంలోకి వస్తేనే గిరిజనుల జీవితాలు మెరుగుపడతాయని అన్నారు.కూటమి అధికారంలోకి వచ్చాక జగన్ రెడ్డి రద్దు చేసిన పథకాలన్నింటినీ పునరుద్దరిస్తామని డా.చదలవాడ హామీ ఇచ్చారు.

Loading spinner
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

You cannot copy content of this page