

నారద వర్తమాన సమాచారం
ప్రజా సేవే లక్ష్యంగా కూటమి నాయకులు ముందుకు వెళ్లాలి
18వ వార్డులో తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన డా.చదలవాడ అరవింద బాబు,లావు శ్రీకృష్ణ దేవరాయలు_నరసరావుపేట పట్టణంలోని 18వ వార్డు తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని ఎంపీ అభ్యర్ధి లావు శ్రీకృష్ణదేవరాయలతో కలిసి డా
.చదలవాడ అరవింద బాబు ప్రారంభించారు నియోజకవర్గంలో ప్రజల సమస్యలు పరిష్కరించడం, నిత్యం వారికి అందుబాటులో ఉండడం కోసమే అన్ని వార్డుల్లోనూ కార్యాలయాలు ఏర్పాటు చేసినట్లు డా
.చదలవాడ తెలిపారు.రాష్ట్రం కోసం,ప్రజల కోసం నిత్యం ఆలోచిస్తూ,వారి సంక్షేమానికి అధిక ప్రాధాన్యమిస్తున్నట్లు తెలిపారు.సమస్యతో వచ్చిన ప్రతి ఒక్కరికీ సత్వర న్యాయం చేసేలా కార్యాలయంలో అందుబాటులో ఉంటానని తెలిపారు.కార్యక్రమంలో జనసేన నరసరావుపేట ఇంచార్జి సయ్యద్ జిలాని,టీడీపీ నాయకులు చేకూరి కోటేశ్వరరావు,వేల్పుల సింహాద్రి యాదవ్,కపిలవాయి విజయ్,మన్నన్ షరీఫ్,కొర్నేపాటి సంజీవ్ రావు నియోజకవర్గ బిజెపి ఇంచార్జి రంగిశెట్టి రామకృష్ణ తదితర నాయకులు పాల్గొన్నారు.అనంతరం కార్యకర్తలతో మమేకమై...కూటమి జెండా ఎగరేసే బాధ్యత మీదేనన్నారు.పార్టీ కోసం,ప్రజల కోసం పని చేసిన ఏ నాయకుడినీ మరచిపోనని,ప్రతి కార్యకర్తకూ తోడుగా నిలిచే బాధ్యత తాము తీసుకుంటామన్నారు.తెలుగుదేశం పార్టీ అంటేనే క్రమశిక్షణకు నిదర్శనం అన్నారు.అదే చిత్తశుద్ధితో రేపు ఎన్నికల్లో కూటమి గెలుపు కోసం కార్యకర్తలు పని చేయాలని డా
.చదలవాడ పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో టీడీపీ,జనసేన,బీజేపీ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు._
Discover more from
Subscribe to get the latest posts sent to your email.