Tuesday, May 20, 2025

ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగులకు ఒక రోజు ప్రత్యేక సాధారణ సెలవు

నారద వర్తమాన సమాచారం

ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగులకు ఒక రోజు ప్రత్యేక సాధారణ సెలవు

అమరావతి మే 5:

ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగులు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఒకరోజు ప్రత్యేక సాధారణ సెలవును మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రధాని ఎన్నికల అధికారి మరియు ప్రభుత్వ ఈవో ప్రిన్సిపల్ సెక్రెటరీ ముఖేష్ కుమార్ మీనా శనివారం ప్రభుత్వ ఉత్తర్వులను జారీ చేశారు.

భారత ఎన్నికల సంఘం సూచనల మేరకు జిఓఆర్టి నెంబర్ 845, తే.04.05.2024 ను జారీ చేయటం జరిగింది.
ఓటర్ ఫెసిలిటేషన్ కేంద్రాలలో పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేయడానికి వీలుగా ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగుల అభ్యర్థన మేరకు సంబంధిత అధికారులు ఒకరోజు ప్రత్యేక క్యాజువల్ సెలవును మంజూరు చేయాలని ఈ ఉత్తర్వుల్లో పేర్కొనడం జరిగింది.

సెక్రటేరియట్ విభాగాలు/విభాగాల అధిపతి/జిల్లా కలెక్టర్లు మరియు ఇతర సంబంధిత అధికారులు తదనుగుణంగా అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆ ఉత్తర్వులలో కోరడం జరిగింది.

(పి ఆర్ ఓ, సీఈఓ కార్యాలయం, ఆంధ్ర ప్రదేశ్ సచివాలయం వారిచే జారి).

Loading spinner
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

You cannot copy content of this page